• రాష్ట్ర వ్యాప్తంగా 14, 864 నర్సరీల ఏర్పాటు
• హరితహారం నిర్వహణ కోసం ఇప్పటి దాకా 10,822 కోట్ల వ్యయం
• రాష్ట్రమంతటా 1,00, 691 కిలోమీటర్ల మేర రహదారి వనాలు

ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక అస్తిత్వం కోసం ఆరాటపడిన తెలంగాణ, రాష్ట్ర సాధన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో పునర్నిర్మాణ ఎజెండాను సిద్ధం చేసుకుంది. దశాబ్దాల పాటు నిర్లక్ష్యానికి గురైన తెలంగాణను బంగారు తెలంగాణ గా మార్చుకునేందుకు నడుం కట్టింది. సంక్షేమం, అభివృద్ధి పథకాలకు తోడుగా రాష్ట్రాన్ని అత్యంత నివాసయోగ్యమైన పచ్చని ప్రాంతంగా మార్చాలని ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. ఆ ఆలోచనల్లోంచి పుట్టిందే తెలంగాణకు హరితహారం.
రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలోనే తీసుకున్న అత్యంత ప్రాధాన్యత పథకాల్లో తెలంగాణకు హరితహారం ఒకటి. మన వారసులకు, రానున్న తరాలకు ఆస్తులు పంచడం కన్నా స్వచ్ఛమైన గాలిని, నివాస యోగ్యమైన పచ్చని ప్రకృతి పరిసరాలను అందించాలనే గొప్ప సంకల్పమే హరితహారానికి పునాది. ఇలా ఆలోచించడం తో పాటు, ఆ దిశగా ప్రజలను ఒక సామాజిక కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు గారికి దక్కింది.
తాను నమ్మిన ప్రకృతి పునరుజ్జీవనానికి తెలంగాణ సమాజంలో ప్రతి మదికీ ఎక్కేలా చేయటంలో ముఖ్యమంత్రి గారు సఫలం అయ్యారు. ఆ కృషి, పట్టుదల ఫలితాలే దశాబ్ది తెలంగాణలో మన కళ్ల ముందు ఆకు పచ్చగా పరుచుకున్నాయి. ఇన్నేళ్లుగా నాటిన మొక్కలు చెట్లుగా మారి ఆక్సిజన్ తో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. హరిత తెలంగాణ సాధనలో ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యమే పచ్చని విజయానికి సాక్షిగా నిలిచింది. ఇలా రాష్ట్రమంతటా పచ్చదనం వెల్లివిరియాలంటే తెలంగాణకు హరితహారం నిరంతర ప్రక్రియలా కొనసాగాలి. మొక్కలు నాటడం, వాటి సంరక్షణ మన జీవన విధానంలో భాగం కావాలి.
హరితహారం ఫలితాలు (2015-23)
• ఇప్పటి దాకా రాష్ట్ర వ్యాప్తంగా 273.33 కోట్ల మొక్కలు నాటారు .
• రాష్ట్ర వ్యాప్తంగా 14, 864 నర్సరీల ఏర్పాటు.
• హరితహారం నిర్వహణ కోసం ఇప్పటి దాకా 10,822 కోట్ల వ్యయం.
• 19, 472 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు. (13,657 ఎకరాల్లో)
• 2,011 బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటు. (6,298 ఎకరాల్లో)
• రాష్ట్రం అంతటా 1,00, 691 కిలోమీటర్ల మేర రహదారి వనాలు.
ఇందులో 12,000 కిలో మీటర్లు బహుళ రహదారి వనాలు.
• పర్యావరణ అవగాహన కోసం స్కూల్ పిల్లలకు విసృతంగా “వనదర్శిని” కార్యక్రమం అటవీశాఖ చేపట్టింది.
తొమ్మిదేళ్లలో అటవీ పునరుద్దరణ ద్వారా సాధించిన విజయాలు
• 13.44 లక్షల ఎకరాల అటవీ పునరుద్ధరణ, 2.03 లక్షల ఎకరాల్లో ప్లాంటేషన్ పూర్తి చేశాము. 24.53 కోట్ల మొక్కలు నాటడం జరిగింది.
• పునరుద్దరణ ద్వారా పెరిగిన మొక్కలు 53.84 కోట్లు.
• 10,886 కి.మీ. మేర అటవీ ప్రాంతాల చుట్టూ కందకాల తవ్వకం.
• అగ్ని ప్రమాదాల నివారణ కోసం 21,452 కి.మీ. మేర ఫైర్ లైన్లు ఏర్పాటు.
• నేల మరియు తేమ పరిరక్షణ (Soil & Moisture Conservation) కోసం అడవుల్లో పెద్ద ఎత్తున నీటి యాజమాన్య పద్ధతుల అమలు. చెక్ డ్యాములు, ఇంకుడు చెరువులు/ కుంటలు మొదలైనవాటి నిర్మాణం.

పట్టణ ప్రాంత అటవీ ఉద్యానవనాలు (అర్బన్ ఫారెస్ట్ పార్కులు) & హరిత వనాలు
• రాష్ట్ర వ్యాప్తంగా నగరాలకు సమీపంలో 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులు. దాదాపు 75, 740 ఎకరాల్లో ఈ పార్కుల అభివృద్ధి.
• 164 హరిత వనాల్లో వంద శాతం పచ్చదనం సాధించేందుకు 1.71 లక్షల ఎకరాల్లో 1.06 కోట్ల మొక్కలు నాటాము.
గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలో హరితహారం అమలు
• ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (FSI) నివేదిక ప్రకారం హరితహారం వల్ల గ్రేటర్ పరిధిలో గత పదేళ్లలో గ్రీన్ కవర్ భారీగా 147 శాతం పెరిగింది.
• సుమారు ఏడు కోట్ల మొక్కలు నాటడం తో పాటు, కొత్తగా 456 కాలనీ పార్కుల అభివృద్ధి. 1120 కిలోమీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్, 115 చోట్ల యాదాద్రి మోడల్ లో (మియావాకి) పచ్చదనం పెంపు.
• గ్రేటర్ పరిధిలో పది శాతం గ్రీన్ బడ్జెట్ కింద పచ్చదనం పెంపు కోసం సుమారు ఏడు వందల కోట్ల కేటాయింపు.


హెచ్ఎండీఏ (HMDA) పరిధిలో హరితహారం – విజయాలు
• సుమారు పన్నెండు కోట్ల మొక్కలు (11.93 కోట్లు) నాటడం జరిగింది.
• ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్ చేంజ్ లు, సర్వీస్ రోడ్లు, పార్కులు పచ్చదనంతో హైదరాబాద్ కు మణిహారం గా మారాయి.
• హైదరాబాద్ చుట్టూ ప్రకృతి రమణీయంగా 16 అర్బన్ ఫారెస్ట్ పార్కులను HMDA డెవలప్ చేసింది.
• గ్లోబల్ సిటీగా మారిన హైదరాబాద్, HMDA కృషి వల్లే గ్రీన్ సిటీ ఆఫ్ వరల్డ్ గా మన్ననలు అందుకుంటోంది.
విజయవంతమైన సంస్థగా ఎదిగిన ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్
• అత్యంత నాణ్యతా ప్రమాణాలతో ప్లాంటేషన్ చేసే సంస్థగా ఫారెస్ట్ స్టీవార్డ్ షిప్ కౌన్సిల్ (జర్మనీ) సర్టిఫికేషన్ పొందిన ఎఫ్.డీ.సీ. (దేశంలోనే మొదటి కార్పొరేషన్.)
• సంప్రదాయ యూకలిప్టస్ స్థానంలో ప్రత్యామ్నాయ మొక్కలు నాటడం, రెవెన్యూ పెంపకంపై దృష్టి. ( టేకు, రోజ్ వుడ్, గంధం, ఎర్ర చందనం, సీతాఫల్, సరుగుడు.)
• గత ఎనిమిదేళ్లుగా సగటున 82. 69 కోట్ల రూపాయల రాబడి, గత ఆర్థిక సంవత్సరం (2022-23) 150 కోట్ల రెవెన్యూ. ఈ ఏడాది అంచనా 200 కోట్ల రూపాయలు.
• ఎఫ్.డీ.సీ నేతృత్వంలో అంతర్జాతీయ స్థాయి ఎకో పార్కులుగా బొటానికల్ గార్డెన్, పాలపిట్ట సైక్లింగ్ పార్క్, ఫారెస్ట్ ట్రెక్ అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధి.

హరితహారానికి దక్కిన అవార్డులు & గుర్తింపు
• ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా(FSI) – స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు 2021 ప్రకారం:
1. 2015-21 మధ్య రాష్ట్రంలో ఫారెస్ట్ కవర్ 6.85 శాతం పెరిగింది. ఇది 3.36 లక్షల ఎకరాలకు సమానం.
2. అదే సమయంలో రాష్ట్రంలో పచ్చదనం (గ్రీన్ కవర్) 7.70 శాతం పెరిగింది. ఇది 5.13 లక్షల ఎకరాలకు సమానం.
• ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ -2020 & 21 గా హైదరాబాద్ కు దక్కిన గుర్తింపు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, అర్బర్ డే ఫౌండేషన్ ద్వారా అవార్డు.
• నీతి అయోగ్ సమీకృత అభివృద్ది లక్ష్యాల సూచీల్లో (2020- 21) అటవీకరణ విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన తెలంగాణ.
• ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ (AIPH), సౌత్ కొరియా ద్వారా వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ – 2022 దక్కించుకున్న హైదరాబాద్.
• వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) దేశవ్యాప్తంగా నగరాల్లో నిర్వహించిన సిటీ నేచర్ ఛాలెంజ్ – 2023 లో మొదటి స్థానంలో నిలిచిన హైదరాబాద్. అత్యధిక జీవ వైవిధ్యం గల నగరంగా గుర్తింపు.
• పచ్చదనం పెంపులో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ, నివేదిక విడుదల చేసిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ (CSE).