బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో తీవ్రమైన సమస్యలు చాలా ఉన్నాయి. మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ తట్టి లేపితే గానీ లేవట్లేదు అని విమర్శించారు.
పంచాయతీలో పారిశుధ్యం గురించి నేను లేవనెత్తాకే కార్మికులకు జీతాలందాయి.. అయినా పంచాయతీలకు నిధులు రాలేదు.కేసీఆర్ హయాంలో ప్రతి నెల పంచాయతీలకే 275 కోట్ల రూపాయలు టంచనుగా విడుదల చేసే వాళ్ళం. మార్చి కన్నా ముందు కేంద్రం రూ. 500 కోట్లు పంచాయతీల కోసం విడుదల చేసింది.. వాటిని కూడా రాష్ట్రం విడుదల చేయలేదు. ఎన్నికలు పెట్టకపోవడం వల్ల మరో రూ. 750 కోట్లు కేంద్రం విడుదల చేయలేదు అని అన్నారు.
రెండు నెలల ఆసరా పెన్షన్లు ఇవ్వలేదు అని నేను నిలదీశాకే ఒక నెలవి ఇచ్చారు. మధ్యాహ్న భోజన పథకం సిబ్బందికి జీతాలు కూడా మేము ప్రభుత్వం దృష్టికి తెచ్చాకే కొంత చలనం వచింది రూ. 2500 కోట్ల మెటీరియల్ కంపోనెంట్ బిల్స్ ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నాయి. కేంద్రం నిధులు వస్తున్నా రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక పోవడం వల్ల అనేక పథకాలపై ప్రభావం పడింది. జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ. 850 కోట్లు కేంద్రం ఇచ్చినా రాష్ట్రం రూ. 350 కోట్లు విడుదల చేయలేదు. కేంద్రం మంజూరు చేసిన నిధులు 15 రోజుల్లో ఖర్చు చేయకపోతే వడ్డీ వసూలు చేస్తారు అని తెలిపారు.
బిల్లులు రాక చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మన ఊరు మన బడి కింద బిల్లులు ఇవ్వక బాత్రూములు కూడా తెరవని పరిస్థితి ఉంది. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండు నెలలు జీతం రాలేదు. పంచాయతీ కార్యదర్శులు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. ఇపుడు బదిలీలు చేస్తున్నారు.. వారికి డబ్బులు ఎవరు ఇవ్వాలి అని హరీష్ రావు అడిగారు.
సిద్దిపేటలో అమలు చేసిన కొన్ని వినూత్న కార్యక్రమాలకు కేంద్ర ఆర్థిక సర్వేలో చోటు లభించడం సంతోషదాయకం. స్టీల్ బ్యాంకు కాన్సెప్ట్ను ఆర్థిక సర్వేలో ప్రత్యేకంగా ప్రస్తావించారు అని తెలిపారు.
రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి.. కనీసం రోజువారీ సమస్యలు కూడా ఈ ప్రభుత్వం తీర్చడం లేదు విద్యుత్ శాఖ తీవ్ర సంక్షోభంలో ఉంది. కరెంటు కోతలకు విచిత్ర కారణాలు చెబుతున్నారు తొండలు, బల్లుల వల్లే కాదు హరీష్ రావు చెబితే కరెంటు తీసేస్తున్నారని అసంబద్ధ కారణాలు చెబుతున్నారు అని దుయ్యబట్టారు.
రైతులు డీడీలు కట్టినా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం లేదు.. స్తంభాలు కూడా ఇవ్వడం లేదు.గ్రామ పంచాయతీలు కరెంటు బిల్లులు కట్టడం లేదు. స్కూళ్లకు కరెంటు బిల్లులు కట్టకపోవడంతో కరెంట్ కట్ చేస్తున్నారు. పోలీసులకు పెట్రోల్, డీజిల్ డబ్బులు కూడా ఇవ్వడం లేదు. కొంత పర్సంటేజ్ పోలీసులు ఇస్తే తప్ప బిల్లులు రావడం లేదు. హోం గార్డులకు జీతాలు సరిగా రావడం లేదు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లకు తులం బంగారం లేదు. కొత్తగా చెక్లు ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారు. దాదాపు లక్ష చెక్కులు పెండింగ్లో ఉన్నాయి. సిద్దిపేటలోనే 3 వేలకు పైగా పెండింగ్లో ఉన్నాయి అని అన్నారు.
రైతుబీమా చెక్కులు నెల రోజులు దాటినా రావడం లేదు. కేసీఆర్ హయాంలో వారం రోజుళ్లో ఐదు లక్షల బీమా చెక్ వచ్చేది. రైతు రుణమాఫీకి రేషన్ కార్డు లింక్ లేదని సీఎం చెప్పినా అమలు కావడం లేదు. పీఎం కిసాన్ యోజనకు రైతు రుణమాఫీకి లింక్ పెడుతున్నారు అని ధ్వజమెత్తారు.
మా అధ్యయనం ప్రకారం లక్ష లోపు రుణమాఫీకి అర్హులైన 30 నుంచి 40 శాతం మందికి మాఫీ కాలేదు. పీఎం కిసాన్ యోజనలో 18 యేండ్లు దాటిన వారిని యాజమానితో సంబంధం లేకుండా లబ్ది దారుడిగా పరిగణిస్తారు.. రుణమాఫీలో ఆలా చేయడం లేదు. ప్రభుత్వం రైతును గుర్తించాలి తప్ప కుటుంబంతో పనేమిటి అని ప్రశ్నించారు.
ఆదిలాబాద్లోని తాంసీ మండలంలో విమల అనే మహిళకు 59 వేల అప్పు ఉంటే 3 వేలే మాఫీ అవుతున్నట్టు మెసేజ్ వచ్చింది.. ఇలాంటి తప్పులు చాలా ఉన్నాయి. రేషన్ కార్డు నిబంధన లేదని ఉత్తగా చెబితే కాదు కొత్త ఉత్తర్వులు ఇవ్వండి.. పీఎం కిసాన్ నిబంధన పెట్టకండి. గత ప్రభుత్వం నిబంధనలే ఆమలు చేస్తున్నాం అని మంత్రులు చెబితే మరి వాటినే అమలు చేయండి అని హరీష్ రావు అన్నారు.
కంచెలు తీసేస్తామని కొత్త కంచెలు తెచ్చారు.. అసెంబ్లీ చుట్టూ కంచెలు పెంచారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు అత్యవసర పనుల కోసం నెలకు 40 లక్షలు ఇచ్చేవారు.. అవి ఏడు నెలలుగా బంద్ అయ్యాయి. చాలా డివిజన్లు చెత్త కూపాలుగా మారాయి. జీహెచ్ఎంసీ ఫిర్యాదుల విభాగం పని తీరు అస్తవ్యస్తం అయ్యింది. ఫస్టుకు జీతాలు చాలా మంది సిబ్బందికి రావడం లేదు. హాస్పిటల్స్లో డాక్టర్ల బదిలీలు అస్తవ్యస్తంగా మారాయి.. ఏ బదిలీల్లో పారదర్శకత లేదు. రోడ్డెక్కని వర్గమే లేదు అని అన్నారు.
2 వేల పడకల ఆస్పత్రులకు సూపెరెంటిండెంట్గా పని చేసిన వారిని వంద పడకల ఆస్పత్రులకు పంపారు. సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు పంపితే వారు అక్కడ ఏం చేస్తారు.. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఉపాధ్యాయులు, ఉద్యోగుల సీఎం రేవంత్ సమావేశం పెట్టి సమస్యలు తీరుస్తా అన్నాడు.. అవేమి అమలు కాలేదు అని విమర్శించారు.
ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి.. స్కూళ్ళ టాయిలెట్ల శుభ్రత సరిగా లేదు. స్కూళ్ళకు ఫ్రీ కరెంటు జీవో ఇస్తామన్నారు..అది ఇవ్వలేదు. నాయి బ్రాహ్మణులకు, రజకులకు ఫ్రీ కరెంటు బంద్ చేశారు అని మండిపడ్డారు.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ల విషయంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో బీహార్ బ్యాచ్ అని మాట్లాడారు. ఆనాడు మాట్లాడింది ఏంటి.. ఇపుడు రేవంత్ చేస్తున్నదేమిటి? అర్హత గల తెలంగాణ బిడ్డలు చాలా మంది ఉంటె డీజీపీగా పంజాబ్ ఆయనను ఎందుకు నియమించావ్. నేను బీహార్, పంజాబ్ ఇతర రాష్ట్రాల అధికారులకు వ్యతిరేకం కాదు.. రేవంత్ అన్న మాటల్నే గుర్తు చేస్తున్నా. ఈ అధికారుల గురించి రేవంత్ అపుడేమి అన్నాడో అన్నిటిని బయటపెడుతాను. బిహారీలంటే దోపిడీదారులని అన్నావ్.. అప్పుడు వద్దు అన్న వారు ఇప్పుడు ముద్దు ఎలా అయ్యారు అని ఎద్దేవా చేశారు.
పంచాయతీలో పారిశుధ్యం గురించి నేను లేవనెత్తాకే కార్మికులకు జీతాలందాయి.. అయినా పంచాయతీలకు నిధులు రాలేదు.కేసీఆర్ హయాంలో ప్రతి నెల పంచాయతీలకే 275 కోట్ల రూపాయలు టంచనుగా విడుదల చేసే వాళ్ళం. మార్చి కన్నా ముందు కేంద్రం రూ. 500 కోట్లు పంచాయతీల కోసం విడుదల చేసింది.. వాటిని కూడా రాష్ట్రం విడుదల చేయలేదు. ఎన్నికలు పెట్టకపోవడం వల్ల మరో రూ. 750 కోట్లు కేంద్రం విడుదల చేయలేదు అని అన్నారు.
రెండు నెలల ఆసరా పెన్షన్లు ఇవ్వలేదు అని నేను నిలదీశాకే ఒక నెలవి ఇచ్చారు. మధ్యాహ్న భోజన పథకం సిబ్బందికి జీతాలు కూడా మేము ప్రభుత్వం దృష్టికి తెచ్చాకే కొంత చలనం వచింది రూ. 2500 కోట్ల మెటీరియల్ కంపోనెంట్ బిల్స్ ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నాయి. కేంద్రం నిధులు వస్తున్నా రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక పోవడం వల్ల అనేక పథకాలపై ప్రభావం పడింది. జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ. 850 కోట్లు కేంద్రం ఇచ్చినా రాష్ట్రం రూ. 350 కోట్లు విడుదల చేయలేదు. కేంద్రం మంజూరు చేసిన నిధులు 15 రోజుల్లో ఖర్చు చేయకపోతే వడ్డీ వసూలు చేస్తారు అని తెలిపారు.
బిల్లులు రాక చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మన ఊరు మన బడి కింద బిల్లులు ఇవ్వక బాత్రూములు కూడా తెరవని పరిస్థితి ఉంది. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండు నెలలు జీతం రాలేదు. పంచాయతీ కార్యదర్శులు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. ఇపుడు బదిలీలు చేస్తున్నారు.. వారికి డబ్బులు ఎవరు ఇవ్వాలి అని హరీష్ రావు అడిగారు.
సిద్దిపేటలో అమలు చేసిన కొన్ని వినూత్న కార్యక్రమాలకు కేంద్ర ఆర్థిక సర్వేలో చోటు లభించడం సంతోషదాయకం. స్టీల్ బ్యాంకు కాన్సెప్ట్ను ఆర్థిక సర్వేలో ప్రత్యేకంగా ప్రస్తావించారు అని తెలిపారు.
రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి.. కనీసం రోజువారీ సమస్యలు కూడా ఈ ప్రభుత్వం తీర్చడం లేదు విద్యుత్ శాఖ తీవ్ర సంక్షోభంలో ఉంది. కరెంటు కోతలకు విచిత్ర కారణాలు చెబుతున్నారు తొండలు, బల్లుల వల్లే కాదు హరీష్ రావు చెబితే కరెంటు తీసేస్తున్నారని అసంబద్ధ కారణాలు చెబుతున్నారు అని దుయ్యబట్టారు.
రైతులు డీడీలు కట్టినా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం లేదు.. స్తంభాలు కూడా ఇవ్వడం లేదు.గ్రామ పంచాయతీలు కరెంటు బిల్లులు కట్టడం లేదు. స్కూళ్లకు కరెంటు బిల్లులు కట్టకపోవడంతో కరెంట్ కట్ చేస్తున్నారు. పోలీసులకు పెట్రోల్, డీజిల్ డబ్బులు కూడా ఇవ్వడం లేదు. కొంత పర్సంటేజ్ పోలీసులు ఇస్తే తప్ప బిల్లులు రావడం లేదు. హోం గార్డులకు జీతాలు సరిగా రావడం లేదు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లకు తులం బంగారం లేదు. కొత్తగా చెక్లు ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారు. దాదాపు లక్ష చెక్కులు పెండింగ్లో ఉన్నాయి. సిద్దిపేటలోనే 3 వేలకు పైగా పెండింగ్లో ఉన్నాయి అని అన్నారు.
రైతుబీమా చెక్కులు నెల రోజులు దాటినా రావడం లేదు. కేసీఆర్ హయాంలో వారం రోజుళ్లో ఐదు లక్షల బీమా చెక్ వచ్చేది. రైతు రుణమాఫీకి రేషన్ కార్డు లింక్ లేదని సీఎం చెప్పినా అమలు కావడం లేదు. పీఎం కిసాన్ యోజనకు రైతు రుణమాఫీకి లింక్ పెడుతున్నారు అని ధ్వజమెత్తారు.
మా అధ్యయనం ప్రకారం లక్ష లోపు రుణమాఫీకి అర్హులైన 30 నుంచి 40 శాతం మందికి మాఫీ కాలేదు. పీఎం కిసాన్ యోజనలో 18 యేండ్లు దాటిన వారిని యాజమానితో సంబంధం లేకుండా లబ్ది దారుడిగా పరిగణిస్తారు.. రుణమాఫీలో ఆలా చేయడం లేదు. ప్రభుత్వం రైతును గుర్తించాలి తప్ప కుటుంబంతో పనేమిటి అని ప్రశ్నించారు.
ఆదిలాబాద్లోని తాంసీ మండలంలో విమల అనే మహిళకు 59 వేల అప్పు ఉంటే 3 వేలే మాఫీ అవుతున్నట్టు మెసేజ్ వచ్చింది.. ఇలాంటి తప్పులు చాలా ఉన్నాయి. రేషన్ కార్డు నిబంధన లేదని ఉత్తగా చెబితే కాదు కొత్త ఉత్తర్వులు ఇవ్వండి.. పీఎం కిసాన్ నిబంధన పెట్టకండి. గత ప్రభుత్వం నిబంధనలే ఆమలు చేస్తున్నాం అని మంత్రులు చెబితే మరి వాటినే అమలు చేయండి అని హరీష్ రావు అన్నారు.
కంచెలు తీసేస్తామని కొత్త కంచెలు తెచ్చారు.. అసెంబ్లీ చుట్టూ కంచెలు పెంచారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు అత్యవసర పనుల కోసం నెలకు 40 లక్షలు ఇచ్చేవారు.. అవి ఏడు నెలలుగా బంద్ అయ్యాయి. చాలా డివిజన్లు చెత్త కూపాలుగా మారాయి. జీహెచ్ఎంసీ ఫిర్యాదుల విభాగం పని తీరు అస్తవ్యస్తం అయ్యింది. ఫస్టుకు జీతాలు చాలా మంది సిబ్బందికి రావడం లేదు. హాస్పిటల్స్లో డాక్టర్ల బదిలీలు అస్తవ్యస్తంగా మారాయి.. ఏ బదిలీల్లో పారదర్శకత లేదు. రోడ్డెక్కని వర్గమే లేదు అని అన్నారు.
2 వేల పడకల ఆస్పత్రులకు సూపెరెంటిండెంట్గా పని చేసిన వారిని వంద పడకల ఆస్పత్రులకు పంపారు. సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు పంపితే వారు అక్కడ ఏం చేస్తారు.. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఉపాధ్యాయులు, ఉద్యోగుల సీఎం రేవంత్ సమావేశం పెట్టి సమస్యలు తీరుస్తా అన్నాడు.. అవేమి అమలు కాలేదు అని విమర్శించారు.
ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి.. స్కూళ్ళ టాయిలెట్ల శుభ్రత సరిగా లేదు. స్కూళ్ళకు ఫ్రీ కరెంటు జీవో ఇస్తామన్నారు..అది ఇవ్వలేదు. నాయి బ్రాహ్మణులకు, రజకులకు ఫ్రీ కరెంటు బంద్ చేశారు అని మండిపడ్డారు.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ల విషయంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో బీహార్ బ్యాచ్ అని మాట్లాడారు. ఆనాడు మాట్లాడింది ఏంటి.. ఇపుడు రేవంత్ చేస్తున్నదేమిటి? అర్హత గల తెలంగాణ బిడ్డలు చాలా మంది ఉంటె డీజీపీగా పంజాబ్ ఆయనను ఎందుకు నియమించావ్. నేను బీహార్, పంజాబ్ ఇతర రాష్ట్రాల అధికారులకు వ్యతిరేకం కాదు.. రేవంత్ అన్న మాటల్నే గుర్తు చేస్తున్నా. ఈ అధికారుల గురించి రేవంత్ అపుడేమి అన్నాడో అన్నిటిని బయటపెడుతాను. బిహారీలంటే దోపిడీదారులని అన్నావ్.. అప్పుడు వద్దు అన్న వారు ఇప్పుడు ముద్దు ఎలా అయ్యారు అని ఎద్దేవా చేశారు.