mt_logo

ఖమ్మంలో 9 మందిని గెలిపిస్తే.. 3 లక్షల ఎకరాలు ఎండబెడతారా?: కాంగ్రెస్‌పై హరీష్ రావు ధ్వజం

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైఫల్యం వల్ల ఎండిపోతున్న పంట పొలాలపై తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహంచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తలాపున సముద్రమున్న చేపపిల్లలు నీటికేడ్చినట్టు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అని మండిపడ్డారు.

ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయ్.. 22 రోజులైన కాల్వకు గండి పూడ్చడం చాతకాగ.. రైతుల పొలాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండపెడుతున్నదని దుయ్యబట్టారు. ఒకవైపు కృష్ణనది నిండు కుండలా ఉంది.. సాగర్‌లో నీరున్న పంటలన్నీ ఎండిపోతున్నాయ్ అని అన్నారు.

పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో రైతులు ఎన్ఎస్పీ ఆఫీసులను ముట్టడిస్తున్నారు. పార్టీలకతీతంగా ధర్నా చేస్తున్న ప్రభుత్వం నిద్రపోతున్నది. ఈసారి పుష్కలంగా వర్షాలు పడిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి అని ధ్వజమెత్తారు.

జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉండి కూడా
గండిపడిన కాల్వ పక్క నుంచే వెళ్తున్నారు కానీ 22 రోజులైనా గండిపూడ్చాలని సోయిలేదా అని ఫైర్ అయ్యారు.

ఆకాశాన్ని దించుతాం, సూర్యుని వంచుతాం అనే డైలాగులు కొడుతున్న రేవంత్ రెడ్డి జిల్లా మంత్రులు.. కాల్వ గండి పూడ్చాడం చాతకాదా? 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. 3 లక్షల ఎకరాల పంటలు ఎండబెడతారా. కాంగ్రెస్ సర్కార్‌కు కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు రావా? అని విమర్శించారు.

హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టడం వచ్చుగానీ.. రైతులకు నీరు ఇవ్వడం రాదా? కాంగ్రెస్‌కు రైతుల పట్ల జాలి, దయా లేవా. వరదల్లో కొట్టుకుపోయిన పంటలకు నష్టం పరిహారం ఇవ్వరా? కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు కన్నీళ్లు తూడ్చడం కాదు.. కన్నీళ్లు పెట్టిస్తుంది అని పేర్కొన్నారు.

ఎకరాకు రూ. 25 వేల సాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వరద నష్టం వల్ల సాగర్ పరివాకం ప్రాంతాల్లో వల్ల 60వేల ఎకరాలు, కాంగ్రెస్ నిర్వాకం వల్ల లక్ష ఎకరాలు పోయినట్లు ప్రాథమిక అంచనా. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ నీరు ఇచ్చినా పంటలు చేతికొచ్చే పరిస్థితులు లేవు అని అన్నారు.

ఆగస్టు 15వ తేదీ ముఖ్యమంత్రి రేవంత్ ఖమ్మం జిల్లాలో సీతారామా ప్రాజెక్టు ప్రారంభించి, సీఎం, మంత్రులు డైలాగులు కొట్టిండ్రు. 70 రోజుల్లో ప్రాజెక్టును పూర్తి చేశామని గొప్పలు చెప్పుకున్నారు సీతారామా ప్రాజెక్టు ద్వారా దిగువన ఉన్న పాలేరుకు నీరు ఎందుకు ఇవ్వట్లేదు అని హరీష్ రావు అన్నారు

పనులు పూర్తికాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీతారామస్వామి మీద ఒట్టు పెట్టి.. మాట తప్పారు. దేవుడా రామచంద్రస్వామి ముఖ్యమంత్రిని క్షమించు, ఖమ్మం జిల్లా రైతులను కాపాడు. ఖమ్మ జిల్లా రైతులు ఏం పాపం చేశారు. 9 మందిని గెలిపిచడం వాళ్ల తప్పా అని అడిగారు.

వరదల్లో కొట్టుకుపోయిన ఇళ్లకు నష్ట పరిహారం ఇవ్వరా.. బీఆర్ఎస్ పార్టీ తరుపున మేం ఖమ్మం జిల్లాకు వెళ్తాం.. రైతులకు మనోధైర్యం చెబుతాం అని తెలిపారు

ట్యాంకర్లు, జనరేటర్లు పెట్టుకొని పంటలు తడుపుకొంటున్నారు. వరద బాధితులను పరామర్శించేందుకు మాపై దాడులు చేసిండ్రు.. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. పోలీసులు అతి ఉత్సాహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగిందో మనం చూసాం అని గుర్తు చేశారు.

పోలీసు అధికారులు చట్టాలకు లోబడి పనిచేయాలి ప్రభుత్వాలకు లోబడి కాదు. ప్రభుత్వ వైఫల్వాలు డైవర్ట్ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాతో హైడ్రామా చేస్తున్నాడు అని మండిపడ్డారు.

లక్షల ఎకరాల్లో పంట పొలాలు ఎండిపోతుంటే, లక్షల మంది డెంగ్యూ చికెన్ గునియా విశ్వవిరాలతో బాధపడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకు హైడ్రా పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో గుండాయిజం పెరిగిపోయింది.. అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయి. రేవంత్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో రెండు వేల అత్యాచారాలు జరిగాయి అని ఆరోపించారు.

హైదరాబాద్, దేవరకద్రలో నిన్న ఒక రోజే రెండు అత్యాచారాలు జరిగాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది అని విమర్శించారు.

నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డిపై ఇండిమీదికి నిన్న రాత్రి కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటి మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఈ దాడికి బాధ్యత వహించాలి అని డిమాండ్ చేశారు.

రాత్రిపూట ఇంటి ముందు పటాకులు పేల్చి, తలుపులు తీయించి మరీ దాడులు చేసిండ్రు. దాడికి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి. పోలీసులు పట్టించుకోవడం లేదు.. దాడికి పాల్పడిన వారిపై వెంటనే డీజీపీ చర్యలు తీసుకోవాలి అని కోరారు.