- ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మహారాష్ట్రలో విశేష స్పందన
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా పవిత్ర పుణ్యక్షేత్రం పండరీపురం విఠలేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన తులసి మొక్కల పంపిణీ


ప్రకృతి సంస్కృతి రెండే మన భవిష్యత్తు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సహకారంతో పండరిపురం లో తులసి మొక్కలు పంపిణీ కార్యక్రమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తొలి ఏకాదశి పురస్కరించుకుని రెండు రోజులు మహారాష్ట్రలో సోలాపూర్ జిల్లాలోని పవిత్రమైన పుణ్యక్షేత్రం పండరీపురంలో విఠలేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన తులసి మొక్కలు వార్కరి సంప్రదాయకులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సోలాపూర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు భగీరథ భారతి బాల్కే తులసి మొక్కలను భక్తులకు అందజేశారు ఈ సందర్భంగా భగీరథ భారతి బాల్కే గారు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా సృష్టికర్త శ్రీ జోగినిపల్లి సంతోష్ దూర దృష్టితో పర్యావరణ పరిరక్షణ పట్ల వీరు తీసుకున్న సంకల్పం అద్భుతమని ప్రశంసించారు.
ఈ సందర్భంగా వార్కరి సంప్రదాయకులు మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో తులసి మొక్కలను పంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా సభ్యులు రాఘవ పర్యావరణ కార్యకర్త పాలడుగు జ్ఞానేశ్వర్ , పూర్ణ, మహారాష్ట్ర వార్కరి సంప్రదాయకులు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.