mt_logo

బీసీల సర్వతోముఖ అభివృద్ధికి కేసీఆర్ సర్కార్ కృషి

  • విదేశీ యూనివర్శిటీలతో పాటు దేశీయ ప్రతిష్టాత్మక సంస్థల్లో బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు
  • రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వెనుకబడిన వర్గాల ఫీజులు చెల్లిస్తున్న ప్రభుత్వం తెలంగాణ
  • 10వేల మంది మెరికలైన తెలంగాణ బీసీ విద్యార్థులకు లబ్ధి
  • ఎటా 150 కోట్లకు పైగా అదనంగా బీసీ విద్యకు కేటాయించనున్న ప్రభుత్వం
  • ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపిన మంత్రి గంగుల కమలాకర్

వెనుకబడిన వర్గాలు అన్ని రంగాల్లో అభ్యున్నతి సాధించాలనే సంకల్పం తో సీఎం కేసీఆర్ గారి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. మెరికల్లాంటి బీసీ విద్యార్థులు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాలయాలు ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ వర్సీటీలు సహా 200కు పైగా ఇన్ట్సిట్యూట్స్ లో ప్రవేశం పొందిన వారికి సంపూర్ణంగా ఫీజులను (ఆర్టీఎఫ్) చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొందన్నారు. ఈ మేరకు నేడు సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను ఆదేశించారు. గతంలో మన రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ఉండేదని ఈ విద్యా సంవత్సరం నుంచి బీసీలకు అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు అమలు చేస్తున్నామన్నారు.

ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 వేల మంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని, ఇందుకోసం అదనంగా ఏటా 150 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఇప్పటికే అంతర్జాతీయంగా యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో చదువుకునే బిసి విద్యార్థులకు అందిస్తున్న ఓవర్సీస్ స్కాలర్షిప్ లతో పాటు రాష్ట్రంలోనూ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తున్నామని, ఇకనుండి దేశంలోని ప్రతిష్టాత్మక కాలేజీల్లోని బిసి బిడ్డలకు సైతం పూర్తి ఫీజు అందించడంతో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో బిసి విద్యార్థులకు పూర్తి ఫీజుల్ని చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణదే అన్నారు మంత్రి గంగుల కమలాకర్.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే ఆసరా పింఛన్లు, రైతుబంధు, ఉచిత కరెంటు తదితర పథకాల్లో మెజార్టీ వాటాతో పాటు ప్రత్యేకంగా వేల కోట్లతో ఆత్మగౌరవ భవనాలు, గ్రామాలు, పట్టణాల్లో కమ్యూనిటీ హాళ్లు, కుల వృత్తిదారుల ఆర్థిక స్వావలంబనకు లక్ష రూపాయల సహాయం, లక్షలాది బీసీ బిడ్డలకు నాణ్యమైన ప్రపంచ స్థాయి విద్యను అందించేలా 327 గురుకుల విద్యాలయాలు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని. నేడు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో చదివే బీసీ బిడ్డలకు ఎస్సీ, ఎస్టీల మాదిరి పీజు అందించడం సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు మంత్రి గంగుల కమలాకర్.