mt_logo

నూతన సచివాలయంలో కలెక్టర్లతో  సీఎం కేసీఆర్‌ తొలి సమావేశం

హైద‌రాబాద్, మే 25: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ సచివాయంలో కలెక్టర్ల సదస్సు ప్రారంభ‌మైంది. సచివాలయం ఆరవ అంతస్థులో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి మంత్రులు, ప్రభుత్వ ముఖ్య సలహాదారులు,సి ఎం ఓ అధికారులు,అన్ని విభాగాల సెక్రెటరీస్, ప్రణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడితో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు,  హాజ‌ర‌య్యారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, 9వ విడత తెలంగాణకు హరితహారం, పోడు పట్టాల పంపిణీ, ఇండ్ల పట్టాల పంపిణీపై సీఎం కేసీఆర్‌ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు.

నూతన సచివాలయం ప్రారంభమైన తర్వాత సీఎం కేసీఆర్‌ కలెక్టర్లతో నిర్వహిస్తున్న తొలి సమావేశం ఇదే. ముందుగా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ భావించినా, ఆ తర్వాత నేరుగా సమావేశమై దశాబ్ది ఉత్సవాలపై దిశానిర్దేశం చేయాలని నిర్ణయించారు.