mt_logo

చెస్ క్రీడాకారిణి వీర్లపల్లి నందితకు అంతర్జాతీయ స్థాయిలో  శిక్షణ : సీఎం కేసీఆర్

హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడలో రాణిస్తూ వరల్డ్  చెస్ ఫెడరేషన్ ద్వారా ‘ఉమన్ క్యాండిడేట్ మాస్టర్’ గా గుర్తింపు పొందిన వీర్లపల్లి నందిత (19) ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు. నందిత అంతర్జాతీయ స్థాయిలో మరెన్నో కీర్తిశిఖరాలను అధిరోహించేందుకు అవసరమైన శిక్షణ, ఇతర ఖర్చుల కోసం రూ. 50 లక్షలను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ దిశగా తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా సీఎం కేసీఆర్ తన కార్యదర్శి భూపాల్ రెడ్డిని ఆదేశించారు.