mt_logo

కేసీఆర్ సీఎం గా హ్యాట్రిక్ సాధించాలని తిరుపతిలో మొక్కులు 

తెలంగాణ సీఎం గా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించి, దేశంలో బీఆర్ఎస్  విస్తరణ జరగాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు తిరుపతి అలిపిరి పాదాల వద్ద కొబ్బరి కాయలు కొట్టి, ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతి   బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు తిరుపతి నుండి తిరుమలకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన నడచి వెళ్లారు. ఈ సందర్భంగా కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఏపీలో ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ నేతృత్వంలో పార్టీ బలోపేతమౌతోందన్నారు.  పార్టీ సిద్దాంతాలు ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేస్తూ పార్టీ విస్తరణకు ఆయన విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. టీడీపీ, వైసీపీ  పాలనలో  ఆంధ్ర రాష్ట్రం  అధోగతి పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ రాష్ట్రంలో  నిరంతర పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో  బీఆర్ ఎస్ తిరుపతి   జిల్లా నాయకులు కల్లూరు బాలసుబ్రమణ్యం, బెల్లంకొండ సురేష్, జ్ఞానేశ్వరి, సాయి కుమార్, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.