mt_logo

గ్రామ పంచాయ‌తీల‌కు రూ.1190 కోట్లు విడుద‌ల‌

  •  గ్రామ పంచాయ‌తీల‌కు రూ.1190 కోట్లు విడుద‌ల‌
  •  హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేస్తున్న స‌ర్పంచ్ లు 
  • మ‌రోసారి ప‌ల్లెల్లో ప‌రుగులు పెట్ట‌నున్న ప్ర‌గ‌తి ప‌నులు
  • సీఎం ఆదేశానుసారం స‌మావేశ‌మై చర్చించిన మంత్రులు హ‌రీశ్‌రావు, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావులు

హైద‌రాబాద్‌, మే 23: గ్రామ పంచాయ‌తీల‌కు రూ.1190 కోట్ల నిధుల‌ను విడుద‌ల చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. సిఎం కెసిఆర్ ఆదేశాల మేర‌కు ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు, పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావులు నిన్న ప్రభుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారితో భేటీ కాగా, ఈ రోజు ఇద్ద‌రు మంత్రులు స‌మావేశ‌మ‌య్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయ‌తీలలో వివిధ ప‌నుల‌కు సంబంధించి నిధుల విడుదల పై చ‌ర్చించారు. రూ.1190 కోట్ల‌ను విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు సంబంధిత అధికారుల‌తో మాట్లాడి వెంట‌నే ఆ నిధుల‌ను విడుద‌ల చేయాల‌ని ఆదేశించారు.

కాగా, ఈ నిధుల‌ను విడుద‌ల చేయ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా స‌ర్పంచ్‌ల‌లో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ నిధులు విడుద‌ల కావ‌డంతో అభివృద్ధి ప‌నులు మ‌రింత వేగంగా జ‌ర‌గున్నాయి. ఇదిలావుండ‌గా స‌ర్పంచ్ ల సంఘం ప్ర‌తినిధులు రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెక‌ల్లి ద‌యాక‌ర్ రావుని హైద‌రాబాద్ లోని మంత్రుల నివాసంలో క‌లిసి సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ నిధుల విడుద‌ల‌తో స‌ర్పంచ్ లలో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం అవుతున్నాయ‌ని చెప్పారు. సిఎం కెసిఆర్ తోపాటు, మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, హ‌రీశ్ రావుల‌కు వారు కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు తెలిపారు. అలాగే సీఎం కేసీఆర్  మ‌న‌సున్న మ‌హ‌రాజు, మాట త‌ప్ప‌కుండా, అంద‌రి శ్రేయోభిలాషిగా ఆలోచిస్తున్నార‌ని, అందుకే ప‌ల్లెల్లో ప్ర‌గ‌తిని దృష్టిలో పెట్టుకుని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, నిధులు విడుద‌ల చేస్తూ అభివృద్ధిని నిరాటంకంగా కొన‌సాగిస్తున్నార‌ని ఆయ‌న‌కు మంత్రులు హ‌రీశ్ రావు, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు లు కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు తెలిపారు.