mt_logo

విజయీభవ కేసీఆర్ పాటని విడుదల చేసిన మంత్రి కేటీఆర్ 

నంది అవార్డు గ్రహిత, న్యాయవాది లక్ష్మణ్ గంగ రాసి, నిర్వహణ చేసిన విజయీభవ కేసీఆర్ పాటని ఈరోజు ప్రగతి భవన్‌లో కేటీఆర్ విడుదల చేసారు, మంత్రి మాట్లాడుతూ.. మా లీగల్ సెల్ న్యాయవాది, నంది అవార్డు గ్రహిత లక్ష్మణ్ గంగ రాసిన పాట చాలా బాగుందని, ఇలాంటి పాటలు ఇంకా రాయాలని చెబుతూ ఈ పాటకి నిర్మాతగా చేసిన హైకోర్టు అడ్వకేట్ పత్తి ప్రవీణ్ కుమార్ గారికి, సంగీతం చేసిన సురేష్ బొబ్బిలి గారికి, దర్శకుడు అభిలాష్ సీఎచ్‌కి, ఎడిటర్ చెన్నూరి శివకుమార్‌కి, అభినందనలు తెలిపారు, ఈ కార్యక్రమంలో హైకోర్టు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కళ్యాణ్ రావు చెంగల్వ గారు, హైకోర్టు న్యాయవాదులు జి.వేణుగోపాల్ రావు ,ఎమ్.వేణుగోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.