mt_logo

సింగరేణి ఉద్యోగుల పిల్లలకు గుడ్ న్యూస్ చెప్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

వైద్య విద్య చదవాలనుకునే తెలంగాణ సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రామగుండం మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం మెడికల్ కాలేజీలో మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లు  ఉండగా, 23 సీట్లు ఆల్ ఇండియా కోటాకు వెళ్తాయి. మిగతా 127 ఎంబీబీఎస్ సీట్లలో 5% రిజర్వేషన్ ప్రకారం, అంటే 7 సీట్లు సింగరేణి ఉద్యోగులకు కేటాయించడం జరిగింది. నీట్ మెరిట్ ప్రకారం భర్తీ చేసే ఈ సీట్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పరిగణలోకి తీసుకుంటారు.  సింగరేణి ఉద్యోగుల నుండి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న సీఎం కేసీఆర్, ఈ మేరకు వారి పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్ కల్పించారు.