mt_logo

రాష్ట్రంలో 2.18 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది: మంత్రి సింగిరెడ్డి

తెలంగాణలో ఎరువుల నిల్వలపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల చేసారు. రాష్ట్రంలో 2.18 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది అని తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. యూరియాతో పాటు అన్ని ఎరువులు సరిపడినన్ని ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖ, జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నది అని అన్నారు. 

7.57 లక్షల మెట్రిక్ టన్నుల ఇతర ఎరువులు

రాష్ట్రంలో 2.18 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉందని తెలిపారు.  ప్రైవేటు డీలర్ల వద్ద 90 వేల మెట్రిక్ టన్నులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద 41 వేల మెట్రిక్ టన్నులు, మార్క్ ఫెడ్ వద్ద 81 వేల మెట్రిక్ టన్నులు, కంపెనీ గోడౌన్లలో 6 వేల మెట్రిక్ టన్నుల నిల్వలుఅందుబాటులో యూరియాతో పాటు మొత్తం 7.57 లక్షల మెట్రిక్ టన్నుల ఇతర ఎరువులు కూడా ఉన్నాయన్నారు.  ఆయా జిల్లాల పంటల సాగు, పంటల పరిస్థితిని బట్టి ఎరువుల నిల్వ ఉందన్నారు. రాబోయే నాలుగు రోజులలో అందుబాటులోకి మరో 18 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఉంటుందన్నారు.  రైతులు దుష్ప్రచారాన్ని నమ్మి ఎరువుల కోసం ఆందోళన చెందవద్దని సూచించారు.  ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు.