mt_logo

ఎమ్మెల్సీ కవిత పక్షాన నిలిచిన సుప్రీంకోర్టు

ఈడీ పై కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. విచారణ కోసం మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించవచ్చా ? లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహిళను ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడానికి సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ దాఖలు చేసారు. కవిత పిటిషన్ పై ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశించారు. ఆ తర్వాత రెండు వారాల్లో రిజైన్డర్ దాఖలు చేయాలని కవితకు సూచన ఇచ్చింది. కవిత తరపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. విచారణకు తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్ జే.రామచంద్ర రావు హాజరయ్యారు.