mt_logo

సుఖేష్ అనే ఒక రోగ్ చేసిన అడ్డమైన ఆరోపణలపై న్యాయపరంగా గట్టి చర్యలు తీసుకుంటాం : మంత్రి కేటీఆర్

నేరస్తుడు, మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్‌ తనపై చేసిన మతిలేని ఆరోపణలు మీడియా ద్వారా తన దృష్టికి వచ్చాయని ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సుఖేష్ అనే వాడి గురించి నేనెప్పుడూ వినలేదు. వాడెవడో కూడా నాకు తెలియదన్నారు. సుఖేష్ అనే ఒక రోగ్ చేసిన అడ్డమైన మాటలపై న్యాయపరంగా గట్టి చర్యలు తీసుకుంటానన్నారు. సుఖేష్ లాంటి నేరస్తుడు మోసగాడు చేసిన అడ్డగోలు వ్యాఖ్యలను మీడియాలో ప్రసారం చేసే ముందు లేదా ప్రచురించే ముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాలని మంత్రి కేటీఆర్ మీడియాకి విజ్ఞప్తి చేసారు.