mt_logo

తెలంగాణ ఆపే శక్తి ఎవరికీ లేదు: కోదండరాం

సోమవారం నాంపల్లిలోని గృహకల్ప ప్రాంగణంలో జరిగిన తెలంగాణ క్రైస్తవ జేఏసీ సమావేశంలో జేఏసీ చైర్మన్ కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని, అలా చేస్తే సీమాంధ్రులకు గట్టి గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. ఇప్పటికే విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుందని, ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు సృష్టించినా వెనక్కిపోదని స్పష్టం చేశారు. తెలంగాణ అడ్డుకునే ముఖ్య నాయకుడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల విషం చిమ్ముతున్నాడని, ఎంత ఆపుదామని చూసినా తెలంగాణ ఆపే శక్తి సీఎంకు లేదని కోదండరాం అన్నారు. సీమాంధ్రులు సరైన వాదనలు వినిపించకుండా అసెంబ్లీలో చర్చను అడ్డుకుంటున్నారని, ఇది అర్థంపర్థం లేని మూర్ఖత్వపు చర్య అని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. బిల్లుపై సవరణలు చేసి పార్లమెంటులో ప్రవేశబెట్టాలని, సంపూర్ణ తెలంగాణ సాధించేవరకు అప్రమత్తంగా ఉండాలని కోదండరాం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం అధ్యక్షుడు వీ శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ క్రైస్తవ జేఏసీ అధ్యక్షుడు రవికుమార్ా ల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *