
ఐటీ మినిస్టర్ కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు, ఈ పర్యటనలో భాగంగా అమెరికాలోని వివిధ రాష్ట్రాలలో వున్న వివిధ కంపెనీల దిగ్గజాలను కలుస్తున్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ ఎన్నారై నేత మహేష్ బిగాల నిజామాబాద్ ఐటీ హబ్ని ప్రమోట్ చేసే భాగంగా క్రిటికల్ రివర్ కంపెనీ ప్రతినిధులను కలిశారు.
మహేష్ బిగాల మాట్లాడుతూ.. ఇప్పటికే క్రిటికల్ రివర్ కంపెనీ ప్రతినిధులు నిజామాబాద్ ఐటీ హబ్లో స్థానిక ఎమ్మెల్యే గణేష్ బిగాలతో పర్యటించారు, ప్రస్తుతం అమెరికా పర్యటనలో వున్నా కేటీఆర్తో క్రిటికల్ రివర్ కంపెనీ ప్రతినిధులు ఫౌండర్ అంజి మారం భేటీ అయ్యారు, ఈ భేటీలో వారు రాబోయే రోజుల్లో నిజామాబాద్ ఐటీ హబ్లో కంపెనీ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసారు, నిజామాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు కనెక్టివిటీ అన్ని రకాలుగా సదుపాయాలు ఉన్నాయని అందుకు రాబోపై రోజుల్లో వారి సంస్థ అక్కడ ఒక బ్రాంచ్ పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసారు అని అన్నారు.
అలాగే ప్రస్తుతం కాలిఫోర్నియా, హైదరాబాద్ మరియు విజయవాడలో కలిసి 1000 మంది ఉద్యోగులతో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంది అన్నారు. నిజామాబాద్ ఐటీ హబ్లో ప్రస్తుతం ఐటీ దిగ్గజ సంస్థలు కార్యకలాపాలు మొదలు పెట్టాయి.