mt_logo

ఖమ్మంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్

ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై రూ.1.37 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్క్‌ను మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. రూ.10 కోట్లతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ (UGD) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దీంతో పాటుగా రూ.2.49 కోట్లతో నిర్మించనున్న అమృత్ 2.0 అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ (UGD) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు, 20వ డివిజన్ SBIT ఇంజనీరింగ్ కళాశాల రోడ్ నందు మున్సిపల్ కార్పొరేషన్ అధ్వర్యంలో రూ.71 లక్షలతో నిర్మించిన స్పోర్ట్స్ పార్క్ (టర్ఫ్ కోర్టు)ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎంతో ఆప్తుడు విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు, రాముడు ఎలా ఉంటాడో తెలీదు, కృష్ణుడు ఎలా ఉంటాడో తెలీదు మాకు రాముడైన, కృష్ణుడైన ఆయనే అని అన్నారు. తెలుగు వారంటూ ఉన్నారు. భారతదేశంలో అంటే వారిని గుర్తించేలా చేసింది ఎన్టీఆర్ అని అన్నారు. చరిత్రలో మహనీయుల స్థానం అజరామనీయం అందులో ఎన్టీఆర్ స్థానం పదిలమని పేర్కొన్నారు.  ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం నా అదృష్టం అని అన్నారు. దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ ఎవరు కొట్టలేదు, అన్నగారు ఎన్టీఆర్  కూడా కొట్టలేదు.. అది సీఎం కేసీఆర్‌కు సాధ్యమవుతుందని స్పష్టం చేసారు.