mt_logo

సీఎం కేసీఆర్‌కు పాలమూరు ప్రగతి పుస్తకం అందజేసిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్ర ఎక్సైజ్ మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, గురువారం నాడు సీఎం కేసీఆర్‌ని ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తాను ప్రత్యేకంగా రూపొందించి ముద్రించిన పాలమూరు ప్రగతి నివేదిక పుస్తకాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి పై సమగ్ర సమాచారంతో కూడిన  పుస్తకాన్ని చూసి సీఎం హర్షం వ్యక్తం చేశారు.

పాలమూరులో జరుగుతున్న అభివృద్ధిని  శాఖల వారీగా, ఆకర్షణీయమైన ఫోటోలను పొందుపరిచి సాధికారిక సమాచారంతో శ్రీనివాస్ గౌడ్ పుస్తకాన్ని రూపొందించడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను సీఎం కేసీఆర్ ఆశీర్వదించారు. భవిష్యత్తులో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మరింతగా అభివృద్ధి చెందేలా సమిష్టి కృషి కొనసాగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.