mt_logo

నేడు కుసుమ జగదీష్ అంత్యక్రియలకు హాజరు కానున్న మంత్రి కేటీఆర్

ములుగు, జూన్ 12 : ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ గారి హఠాన్మరణం మన ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీకి, ప్రజా ప్రతినిధులకు, ములుగు జిల్లా ప్రజలకు తీరని లోటు వారు మన మధ్య ఉన్నప్పుడు ప్రతి నిమిషం ప్రజా శ్రేయస్సు కోసమే పాటుపడ్డారు. వారు ఉద్యమంలో ఎంతో చురుకైన పాత్ర పోషించారు. నేడు వారు మన మధ్య లేకపోవడం అత్యంత బాధాకరం. ఈ రోజు వారి స్వగ్రామం ములుగు జిల్లా అడవి మల్లంపల్లిలో జరగబోయే అంత్యక్రియలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. 

అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి సత్యవతి రాథోడ్

ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ నేడు అంత్యక్రియల ఏర్పాట్లను మంత్రి సత్యవతి రాథోడ్ గారు పర్యవేక్షించారు. ములుగుజిల్లా, మల్లంపల్లిలో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ గారి అంతక్రియల కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సత్యవతి రాథోడ్ గారు  సిబ్బందికి అధికారులకు పలు సూచనలు చేశారు. ఉదయం కుసుమ జగదీష్ గారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు హాజరుకానున్న నేపథ్యంలో  భద్రత ఏర్పాట్లు పై  జిల్లా ఎస్పీ , కలెక్టర్,  అధికారులకు మంత్రి ఆదేశాలు జారి చేశారు.