mt_logo

రైల్ కాల్పుల ఘటనలో మరణించిన సైఫుద్దీన్  కుటుంబానికి మంత్రి కేటీఆర్ అండ

అసెంబ్లీలో హామీ ఇచ్చిన ప్రకారం, జూలై 31న జైపూర్-ముంబై రైలు ఘటనలో మరణించిన హైదరాబాద్ నివాసి సయ్యద్ సైఫుద్దీన్ కుటుంబానికి మంత్రి కెటి రామారావు అన్ని విధాలుగా అండగా ఉంటామని పేర్కొన్నారు. .మరణించిన సైఫుద్దీన్ భార్య అంజుమ్ షాహీన్ ను శనివారం అసెంబ్లీ ఆవరణలోని తన కార్యాలయంలో  కలిసారు. తెలంగాణ ప్రభుత్వం వారి కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. మరణించిన సైఫుద్దీన్ భార్య అంజుమ్ షాహీన్ కు  కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలో ఆఫీస్ సబార్డినేట్‌గా నిమించిన ఉత్తర్వులను ఆమెకు అందజేశారు. దీంతో పాటు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్‌ను మంజూరు చేసిందని తెలిపి, దాని తాలూకు కేటాయింపు పత్రాన్ని అందజేశారు. 

మృతుడి కి ముగ్గురు పిల్లలు ఉన్న నేపథ్యంలో… ఒక్కొక్కరి భవిష్యత్తు భరోసా కోసం రెండు లక్షల చొప్పున మొత్తం ఆరు లక్షల రూపాయలు..  బి ఆర్ ఎస్ పార్టీ తరపున అందించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు.  రైలు ఘటనలో మరణించిన సైఫుద్దీన్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి,మంత్రి కేటీఆర్ గారికి  హోం మంత్రి మహమ్మద్ మహ్మూద్ అలీ కృతఙ్ఞతలు తెలిపారు.