
సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన నామినేషన్ దాఖలు చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాకు రాజకీయ బిక్షని ఇచ్చిన నియోజకవర్గం సిరిసిల్ల సగర్వంగా తెలిపారు. సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదంతోనే గెలిచి సిరిసిల్ల అభివృద్ధి చేసానన్నారు. సిరిసిల్ల జిల్లా ప్రజలు తల ఎత్తుకునే విధంగా పనిచేసాను. ఎట్లుండే సిరిసిల్ల ఇప్పుడు ఎలా అయ్యిందని అడిగారు. రాష్ట్రంలో సిరిసిల్ల అభివృద్ధిలో ముందు ఉన్నాం అని పేర్కొన్నారు. కేసీఆర్ ఆశీర్వాదంతో తొమ్మిది ఎండ్లు మంత్రిగా పనిచేసానని వెల్లడించారు. గౌరవ మెజారిటితో తిరిగి గెలిపిస్తారని నమ్మకం ఉందని ఆశ భావం వ్యక్తం చేసారు. తానే క్యాండెట్ అనే విధంగా నాలుగుసార్లు గెలిపించారు. ఇంటింటికి ప్రగతి నివేదికలు పంపుతానని చెప్పారు. నేను సిరిసిల్లకి ఏం చేసాను, బీజేపీ కాంగ్రెస్ ఏం చేసారని ప్రశ్నించారు.
రాజీలేని పొరాటం చేస్తున్న కేసీఆర్ పై కాంగ్రెస్, బీజేపీ దండయాత్రకు వస్తున్నారు. గుజరాతీ వారు దండయాత్ర చేయడానికి వస్తే ఊరుకుందమా? అని అడిగారు. చేవలేని, సాతగాని వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు.కరెంటు కావాలా?కాంగ్రెస్ కావాలా? అని ప్రశ్నించారు. కన్నీళ్ళు కావాలా, నీళ్ళు కావాలా? కులం, మతం పెరా కుంపట్లు కేసీఆర్ పెట్టలేదని స్పష్టం చేసారు. ఎన్నికలు రాగానే కులం, మతం అంటున్నారు. కులపిచ్చి, మతపిచ్చి ఉన్న నాయకులు మనకు అవసరమా? అని అడిగారు. ఢిల్లీ వాడు వచ్చి దండయాత్ర చేస్తుంటే ఊరుకుందమా? తాత్కలిక పైసలు, మందుకు లొంగిపోతే ధీర్ఘకాలం బాధపడుతాం అని హెచ్చరించారు. తెలంగాణ గొంతుక పోగొట్టుకుంటే మళ్ళీ బాధపడాల్సి వస్తదని సూచించారు.