mt_logo

కాంగ్రెస్ వెధవలకు కనీసం బుద్ధుందా?: మిర్యాలగూడ రోడ్ షోలో మంత్రి కేటీఆర్ 

మిర్యాలగూడ రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిమ్మల్ని చూస్తుంటే బీఆర్ఎస్ విజయోత్సవ ర్యాలీలా ఉందన్నారు.  2014 ముందుకు మిర్యాలగూడ ఎట్లుండేది ఇప్పుడు ఎట్లుంది అని అడిగారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఎంత ఘోరంగా ఉండేది? రేవంత్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కరెంటు కనబడత లేదంట అని ఎద్దేవా చేసారు. 

కాంగ్రెస్ వెధవలకు కనీసం బుద్ధుందా? 11సార్లు వాళ్లకు అధికారం ఇచ్చిన ఏ మాత్రం అభివృద్ధి చేయని సన్నాసులు కాంగ్రెస్ వాళ్లు,  సెల్ ఫోన్లలో టింగు టింగు మంటు రైతుబంధు పడుతుందా? పడట్లేదా? సన్నాసుల చేతిలో, ఎదవల చేతుల్లో పెడదామా ఈ రాష్ట్రాన్ని? అని ప్రశ్నించారు. ధరణి రద్దు చేస్తాం, గ్రామాలలో పట్వారి వ్యవస్థను తీసుకొస్తా అంటున్నాడు బట్టి విక్రమార్క,  మిర్యాలగూడ కళకళలాడుతుందంటే ఇక్కడ వ్యవసాయం బాగున్నట్టే  కదా అన్నారు. ప్రతి గ్రామంలో మహిళా సమాఖ్య భవనాలను కట్టిస్తాం అన్నారు. దామరచర్లలో 30 వేల కోట్లతో పవర్ ప్లాంట్‌ను కడుతున్నాం అని వెల్లడించారు. గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండితే వస్తాయా? అని అడిగారు.