mt_logo

రాష్ట్రంలోని 17,227 మంది రేషన్ డీలర్లకు తీపి కబురు అందించిన సర్కార్

  • రేషన్ డీలర్ల కమిషన్ మెట్రిక్ టన్నుకు 1400 కు పెంపు
  • తెలంగాణ ఏర్పడిన నుండి 7 రెట్లుగా 200 నుండి 1400 కు పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్
  • రాష్ట్ర ప్రభుత్వం ఏటా అదనంగా 139 కోట్ల కేటాయింపు
  • కరోనా సమయంలో సేవలందిస్తూ మరణించిన 100 మంది డీలర్ల వారసులకు షాపుల కేటాయింపు

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో రేషన్ డీలర్ల సంఘం జేఏసీ ప్రతినిధులతో రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేడు రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన చర్చలు సఫలం అయ్యాయి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి డీలర్ల జేఏసీ నేతల సమక్షంలో జరిపిన సమావేశంలో అన్ని అంశాలను కూలంకషంగా చర్చించారు. మెట్రిక్ టన్ను కు ప్రస్తుతమున్న 900 రూపాయల నుండి 1400 రూపాయలకు ముఖ్యమంత్రి ఆదేశంతో పెంచుతున్నట్టు మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ ప్రకటించారు. 

ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,227మంది రేషన్ డీలర్లకు లబ్ధి చేకూరుతుంది, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా 139 కోట్ల అదనపు భారం పడుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల్లో ప్రతీ ఒక్కరి సంక్షేమాన్ని చూస్తున్నారని, రేషన్ డీలర్లను సైతం ఆదుకోవాలని ఆదేశించారని మంత్రులు తెలియజేసారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు కేవలం మెట్రిక్ టన్నుకు 200 రూపాయలు మాత్రమే ఉండేదని ప్రస్థుతం దానిని 1400 రూపాయలకు పెంచామన్నారు. అతి తక్కువ సమయంలో 700 శాతం కమిషన్ పెంచిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కేంద్ర ప్రభుత్వ కోటాకు అధనంగా ఇవ్వడం లేదని కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలోని 90.05 లక్షల కార్డుల్లో దాదాపు 35.56 లక్షల కార్డుల్లోని 91 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున అందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్డులకు సైతం అధనంగా కిలోను కేటాయిస్తున్నామన్నారు. కమిషన్ సైతం కేంద్రం పెంచుకున్నా పెంచి అందిస్తున్నామన్నారు. 

ఏకమొత్తంగా 1400 రూపాయలకు కమిషన్ పెంచడమే కాకుండా రేషన్ డీలర్లు అడుగుతున్న ప్రధానమైన 13 అంశాలను ప్రభుత్వం పరిష్కరించింది. కరోనా సమయంలో సేవలందిస్తూ మరణించిన 100 మంది డీలర్ల వారసులకు కారుణ్య నియామకం కింద డీలర్షిప్ మంజూరు చేయడం, రాష్ట్రంలో అమలవుతున్న రైతు, నేత, గౌడ తదితర బీమాల తరహాలో రేషన్ డీలర్లకు 5లక్షల బీమా అమలు చేయడం, ఆరోగ్యశ్రీ పరిధిలోకి ప్రతీ డీలర్ను తీసుకురావడం, ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద ఖచ్చితమైన తూకం వేసేలా వేబ్రిడ్జిల ఏర్పాటు, డీలర్ షిప్ రెన్యువల్ ని 5 ఏళ్ల కాలపరిమితికి పెంచడం, రేషన్ డీలర్ షిప్ వయోపరిమితిని 40 నుండి 50 ఏళ్లకు పెంపు, అంత్యక్రియల నిర్వహణకు తక్షణ సాయం 10 వేలు, 1.5 క్వింటాళ్ల వేరియేషన్ ను కేసుల పరిధి నుండి తీసివేయడం,  హైదరాబాద్ లో రేషన్ భవన్ నిర్మాణానికి భూ కేటాయింపు తదితర 13 అంశాలపై సానుకూలత వ్యక్తం చేశారు.