mt_logo

కాంగ్రెస్‌ని నమ్మితే మోసపోతం, పాపమంటే గోస పడ్తం: మంత్రి హరీశ్ రావు

పాలకుర్తిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావుకి మద్ధతుగా నిర్వహించిన రోడ్ షోలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..ఆపదలో ఆదుకున్న, తలలో నాలుకలా ఉండే దయాకర్ రావు గెలవాలా? ఓట్ల ముందట నోట్ల కట్టలు పట్టుకొచ్చిన అమెరికా ఎన్నారైలు గెలవాలా? అని అడిగారు. ప్రతీ గల్లీకి సీసీ రోడ్లు, ఇంటింటికీ మంచి నీళ్లు ఇచ్చిండు దయాకర్ రావు అని తెలిపారు. 

ఆపోజిట్ అభ్యర్ధి అమెరికాలో విల్లాలు గిఫ్ట్‌గా ఇచ్చి టిక్కెట్లు కొన్నరని కాంగ్రెసోళ్లే అంటున్నరు. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ స్ఫూర్తి నిండిన పాలకుర్తి ప్రజల ఆత్మగౌరవాన్ని ఎవరు కొనలేరని స్పష్టం చేసారు. డబ్బులున్నయని కాంగ్రెసోళ్లకు అహంకారం. దాంతో లీడర్లను కొంటరు కానీ ప్రజలను కొనలేరు. దయన్న గెలుపును నోట్ల కట్టలు అడ్డుకోలేవన్నారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు అని చెప్పి ఉన్న గోసి ఊడపీకిర్రు అని ఎద్దేవా చేసారు. నమ్మితే మోసపోతం, పాపమంటే గోస పడ్తం అని హెచ్చరించారు. 

ఓడినోడు నేనే ముఖ్యమంత్రి అంటడు, గెలిచినోడు నేనే ముఖ్యమంత్రి అంటడు. ఇలాంటి కాంగ్రెస్ చేతిలో రాష్ట్రాన్ని పెట్టి రిస్క్ తీసుకుందామా? అనడిగారు. గిరిజనులకు శుభవార్త. ఈ సారి దయాకర్ అన్నను గెలిపిస్తే అందరికీ గిరిజన బంధు అమలు చేస్తాం అని హామీ ఇచ్చారు. దయాకర్ అన్న మంచి మనిషి. గుణమున్న వ్యక్తి. ఆపద వచ్చినప్పుడు సాయం చేసే మనిషని వెల్లడించారు. కాంగ్రెసోళ్లు నోట్ల కట్టలతో విమానం దిగంగనే చూసి ఆగమవుతామా? ఆలోచించడని కోరారు. దయన్నని గెలిపించి ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం. పాలకుర్తి పవర్ ఫుల్ గా ఉండాలంటే దయన్నని గెలిపించాలని కోరారు. 

నిన్న ప్రియాంక గాంధీ వచ్చింది. ఆమె సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో 403 నియోజకవర్గాలు ఉంటే కేవలం 2 మాత్రమే గెలిచింది కాంగ్రెస్. అక్కడ ఎన్నికల ఇంచార్జ్ ప్రియాంక గాంధీనే. ఈమెను సొంత ప్రజలే ఓడించిండ్రు. అలాంటి మనిషి ఇక్కడికొచ్చి చెప్తే ఓటేస్తామా? అని అడిగారు. కాంగ్రెస్ వస్తే కరువు వస్తది. కాంగ్రెస్ వస్తే రైతుబంధు పోతది. కాంగ్రెస్ వస్తే కరెంట్ కట్ అయితదని సూచించారు. కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీలో ఉంటే కేసీఆర్‌కి హైకమాండ్ ప్రజలే అని తేల్చి చెప్పారు. మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ ని, మన కేసీఆర్‌ని మూడోసారి గెలిపించుకుందాం అని తెలిపారు.