mt_logo

లక్ష మందితో కేసీఆర్ జనగామ సభను విజయవంతం చేయాలి: హరీశ్ రావు

జనగామ జిల్లా: ఈ నెల 16వ తేదీన జనగామ జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశానికి ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..  జనగాంలో ఎంట్రీతోనే అద్భుతమైన విజయం సాధించే దిశగా సాగుతున్న రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. 

తెలంగాణ ఉద్యమానికి పోరు గడ్డ జనగామ

కేసీఆర్‌కు జనగామంటే చాలా ప్రేమ. జనగామ ప్రజల ఉద్యమ స్ఫూర్తిని ముఖ్యమంత్రి కేసీఆర్ చూశారని అన్నారు.తెలంగాణ ఉద్యమానికి పోరు గడ్డ జనగామ ప్రాంతం అని చెప్పారు. పెద్ద మనసుతో పల్లా రాజేశ్వర్ రెడ్డిని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి  ఆశీర్వదించడమే కాకుండా భవిష్యత్తులో చేయాల్సిన  పనుల బాధ్యతను అప్పగించారని అన్నారు. సూర్యాపేట జిల్లాకు చెందిన వేణుగోపాల్ రెడ్డి అనే విద్యార్థి 2010లో ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణ కోసం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్య చేసుకొని అమరుడయ్యాడని గుర్తు చేశారు. విద్యార్థి మృతదేహాన్ని తరలించే క్రమంలో పోలీస్ లాఠీచార్జిల మధ్యలో తొలిసారి పరిచయమైన వ్యక్తి పల్లా రాజేశ్వర్ రెడ్డి,  తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎమ్మెల్సీగా, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా అనేక బాధ్యతలతో ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ బాధ్యతలు చేపట్టడం సంతోషకరమైన విషయమన్నారు. 

10 ఏళ్లు నిండకముందే కేసీఆర్ చేసి చూపించాడు

పల్లా రాజేశ్వర్ రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మంచి మనసుతో దీవించారు ముత్తిరెడ్డి యాదగిరి గారు. ఇది బీఆర్ఎస్ సంస్కృతి. అదే కాంగ్రెస్ పార్టీ అయితే  గ్రూపులు, కొట్లటతో కుర్చీల కోసం మత కల్లోహాలు సృష్టించే పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీకి 11 సార్లు అవకాశం ఇచ్చినా చేయలేని పనులు 10 ఏళ్లు నిండకముందే కేసీఆర్ చేసి చూపించాడని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనకు బీఆర్ఎస్ పాలనకు చర్చకు సిద్ధమంటున్నడు ఒక కాంగ్రెస్ నాయకుడు. కాంగ్రెస్ పాలన అంటే కరువులు, కర్ఫ్యూలు, కరెంట్ కోతలు.అదే బీఆర్ఎస్ ధాన్యం ఉత్పత్తిలో డాక్టర్‌ల ఉత్పత్తిలో నెంబర్ వన్. రైతులకు 24 గంటలు కరెంటు ఇచ్చుడులో నెంబర్ వన్, రైతు బంధువుల నెంబర్ వన్, రైతు బీమాలో నెంబర్ వన్, ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించడంలో నెంబర్ వన్ అని తెలిపారు. 

హామీలను నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ 

కాంగ్రెస్ పార్టీ 2009లో  ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన, చెప్పిన హామీలను నెరవేర్చిన నాయకులు. ఎన్నికల హామీలో లేని రైతుబంధు  చేసిండు ఇంటింటికి మిషన్ భగీరథ మంచినీళ్లు ఇవ్వడం ఇలా ఒకటి కాదు అనేక కార్య్రమాలు చేసి చూపించాడు.కర్ణాటకలో కాంగ్రెస్ అమలు చేయని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి చేతులు ఎత్తేశారు. జనగామలో గెలుపు విషయంలో అనుమానం లేదు మెజార్టీ ఎంత అనేది ముఖ్యం. సిద్దిపేటలో నాతో పక్కన దయాకర్ రావుతో పోటీ పడాల్సిందే అన్నారు. అన్ని వర్గాలను కలుపుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ సభను లక్ష మందితో  విజయవంతం చేసుకుందాం. నాయకులు ఇద్దరు కలిసి పోయారు కాబట్టి కార్యకర్తలు కూడా మనస్పర్థలు లేకుండా కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారికి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవించారని తెలిపారు. యాదన్నలాగా జనగామని కంటికి రెప్పలా కాపాడుకునే మరో నాయకుడు దొరికాడని అన్నారు.