mt_logo

సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా మేము వ్యతిరేకిస్తాం 

ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్‌ తెలంగాణకు రావాల్సిన పెండింగ్‌ అంశాలపై, పార్టీ ఎంపీలతో కలిసి వివిధ ప్రాజెక్టులు, పథకాలు, అభివృద్ధి అంశాలు అందించాల్సిన సహాయంపై పలువురు కేంద్ర మంత్రులను కలువనున్నారు. ఇందులో భాగంగా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ను కలిసారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి మోడీ కి అవకాశం ఇస్తే ఢిల్లీని కూడా తీసుకెళ్లి గుజరాత్ లో పెడతాడు. రేపు ప్రజలు ఏకం చేసే అంశాన్ని నమ్ముతాం కానీ రాజకీయ పార్టీలు ఏకం చేసే అంశాన్ని కాదు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో దేశాన్ని అభివృద్ధి చేయడంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీలు ఘోరంగా విఫలం అయ్యాయి. ఇప్పటికీ విద్యుత్, నీటి సరఫరాలేని గ్రామాలు కూడా దేశంలో ఉన్నాయంటే వీటి బాధ్యత పూర్తిగా ఈ రెండు జాతీయ పార్టీలదే. ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ప్రజల్లో ఐకమత్యం రావాల్సిన అవసరం ఉన్నది. అంశాల వారీగా ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసే  ప్రయత్నాన్ని కొనసాగిస్తాం. 

తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని తెలంగాణ అభివృద్ధిని, నమూనాను దేశవ్యాప్తంగా  అమలు చేయాలనుకుంటున్నాము. నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైన విషయం అందరికీ తెలుసు. ఎవరు ఎవరితో కుమ్మక్కు అవుతున్నారో ప్రజలకు తెలుసు. దేశంలో ఇప్పటి దాకా పనిచేసిన ప్రధాన మంత్రుల్లోకెల్లా అత్యంత బలహీనమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ బలహీనతలను దేశంలో అందరికంటే ఎక్కువగా విమర్శించింది భారత రాష్ట్ర సమితి నే, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్రం  ఏ నిర్ణయం తీసుకున్నా మేము  తీవ్రంగా వ్యతిరేకిస్తాము. ఢిల్లీలో తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్సును పార్లమెంట్లో అందుకు వ్యతిరేకంగా నిలబడతాం. సమైక్య స్ఫూర్తికి వ్యతిరేకమైన ఈ ఆర్డినెన్స్ ను కాంగ్రెస్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో వాళ్లే చెప్పాలని అన్నారు.