mt_logo

కేసీఆర్ మహాసంకల్పం నెరవేరిన రోజిది.. సీతారామ ప్రాజెక్ట్ మోటార్ల ట్రయల్ రన్‌పై కేటీఆర్ హర్షం

బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టిన సీతారామ ప్రాజెక్ట్ మోటార్ల ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

మరో స్వప్నం సాకారమైన క్షణమిది.. కేసీఆర్ గారి మహాసంకల్పం నెరవేరిన రోజిది. సీతారామ ప్రాజెక్టు నా గుండెకాయ అని.. కేసీఆర్ ఆనాడే ప్రకటించారు అని పేర్కొన్నారు.

ఖమ్మం నుంచి కరువును శాశ్వతంగా పారదోలే వరప్రదాయినికి ప్రాణం పోశారు కేసిఆర్ గారు. ప్రాజెక్టు పనులను శరవేగంగా పరుగులు పెట్టించారు.. పటిష్ట ప్రణాళికను యుద్ధప్రాతిపదికన అమలుచేశారు అని గుర్తు చేశారు.

ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని 10 లక్షల ఎకరాల్లో పచ్చని పంటలకు బంగారు బాటలు వేశారు. ఖమ్మంలోని ప్రతి ఇంచుకు ఇక ఢోకా లేదు. దశాబ్దాలపాటు దగాపడ్డ రైతుకు ఇక చింత లేదు అని అన్నారు.

కాలమైనా.. కాకపోయినా.. పరవళ్లు తొక్కుతున్న ఈ గోదావరి జలాలతో.. ఖమ్మం రైతుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నిండుతాయి అని కేటీఆర్ అన్నారు. కేసిఆర్ కలను సాకారం చేసి.. ఈ జలవిజయంలో భాగస్వాములైన.. నీటిపారుదల అధికారులు, సిబ్బందికి అభినందనలు. కష్టపడిన ప్రతిఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.