mt_logo

కాంగ్రెస్ వాళ్లకు ఒక్క ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి: మంత్రి కేటీఆర్

యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్ట పట్టణంలో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. నవంబర్ 30వ తేదీన బీఆర్ ఎస్ పార్టీలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. యాదగిరిగుట్టలో ఈరోజు తరలి వచ్చిన జనాన్ని చూస్తే ఆలేరులో గొంగిడి సునీతా గెలిచినట్లుగా అనిపిస్తుందన్నారు. 2014 లో..యాదగిరిగుట్ట ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందని అడిగారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం ఏoత అద్భుతంగా నిర్మాణం చేపట్టారు కేసీఆర్.. ప్రపంచం గర్వించదగ్గగా తెలంగాణ ప్రభుత్వం హయాంలో యాదాద్రి ఆలయం నిర్మాణం రూపుదిద్దుకుందని అన్నారు. 

డిసెంబర్ 3వ తేదీ తర్వాత యాదగిరిగుట్ట కొండ పైకి ఆటోలు నడిచే విధంగా చర్యలు చేపడుతామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రైతులకు వ్యవసాయ బావుల వద్ద కరెంట్ కష్టాలు తీరినవని సూచించారు. కాంగ్రెస్ నాయకులు రైతన్నలకు 3 గంటలు కరెంట్ చాలు అంటున్నారు.. వాళ్లకు ఎద్దు తెలువదు వ్యవసాయం తెలువదని ఎద్దేవా చేసారు. తెలంగాణలో రైతులకు  24 గంటల ఉచిత కరెంట్ ఉండాలంటే తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు. కాంగ్రెస్ వాళ్లకు ఒక్కఛాన్స్ ఎందుకు ఇవ్వాలని అడిగారు. యాదాద్రిలో బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాము రాష్ట్రంలో తాగునీరు,సాగునీరు, అందించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని స్పష్టం చేసారు. ప్రతి ఊర్లో ఒక మహిళ సమాఖ్య భవనం ఏర్పాటు చేస్తాం అని హామీ ఇచ్చారు. ఆలేరులో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓట్లు వేసి గొంగిడి  సునీతను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.