mt_logo

కాంగ్రెస్ దద్దమ్మలు గెలవడం చేతకాక ప్రభాకర్ రెడ్డి మీద కత్తులతో దాడులా?: సీఎం కేసీఆర్

కాంగ్రెస్ దద్దమ్మలు గెలవడం చేతకాక ప్రభాకర్ రెడ్డి మీద కత్తుల పట్టి దాడులు చేసిండ్లని సీఎం కేసీఆర్ అన్నారు.  నారాయణఖేడ్ ప్రజా ఆశీర్వాద సభ. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్  పరిపాలనలో ఉన్న నారాయణఖేడ్ కు బీఆర్ఎస్ పాలనలో ఉన్న నారాయణఖేడ్ కు ఢిల్లీకి ఆస్మాన్‌కు ఉన్నంత ఫరక్ ఉన్నది. చాలా మార్పులు వచ్చినయని అన్నారు. దీనికి ముఖ్య కారకుడు నారాయణఖేడ్ హీరో భూపాల్ రెడ్డి.  ఉప ఎన్నికల్లో మీరు ఆశీర్వాదం ఇచ్చిన దగ్గర నుంచి నేటి వరకు  తన వ్యక్తిగత పని ఒక్కడి కూడా నన్ను  ఎప్పుడూ అడుగలేదు. కొత్త మండలాలు, పాఠశాలలు, ప్రాజెక్టులు, నియోజకవర్గం కోసం పనులు అడిగేవారు. అందుకే నారాయణఖేడ్ ఇంత మంచి అభివృద్ధి జరిగింది. భవిష్యత్తులో ఇంకా జరుగాలని తెలిపారు. 

నారాయణఖేడ్‌కు నేను మంత్రిగా ఉండే రోజుల్లో చాలా సార్లు వచ్చినాం. ఒకప్పుడు ఇక్కడ  రేకు డబ్బాలు కనపడేవి. ఇప్పుడు భవంతులు కనపడుతున్నాయి. అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయని స్పష్టం చేసారు.  ప్రభుత్వ ఉద్యోగులు ఒకప్పుడు రావడానికి భయపడేది. ఇప్పుడు ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు హరీశ్ రావు ఇక్కడకు  చిమ్నిబాయి అనే లంబాడీ మహిళ హరీశ్ రావును అడిగిందంట. త్రాగడానికి నీళ్లు లేవు. ఎందుకు ఓటు వెయ్యాలే అని అడిగిందట. మంచంలో కూర్చుని స్నానం చేసి కింద తాంబూలం పెట్టుకుని నీళ్లు పట్టి పశువులకు పెట్టుకుందామని అందట అని పేర్కొన్నారు. 

బసమేశ్వర, సంగమేశ్వర లిఫ్టులు పెట్టుకున్నాం., కాళేశ్వరం ప్రాజెక్టుకు సింగూరుకు లింకు పెట్టుకున్నాం. జహీరాబాద్ కు నారాయణఖేడ్ కు లిఫ్టు పెట్టుకున్నాం. సింగూరు సంవత్సరం పొడవునా నిండి ఉండే ఉంటది. శాశ్వతమైన జలవనరుగా తయారైంది అన్నారు. మల్లన్న సాగర్ నుంచి వస్తున్న కాలువ నర్సాపూర్ వరకు తవ్వకం అయింది. దీని ద్వారా 40 వేల ఎకరాల వరకు నీళ్లు రాబోతున్నాయి. బసవేశ్వర కంప్లీట్ అయ్యి, మల్లన్న సాగర్ వచ్చేస్తే సుమారు లక్షా 80 వేల  ఎకరాలకు  సాగునీరు వస్తుంది. భూపాలరెడ్డిని గెలిపించండి నల్లవాగు లిఫ్టు ఇరిగేషన్ పెట్టిస్తాను. రెండు పంటలు పండేట్లు నీళ్లు అందుతాయి. బాధ్యత నాదని హామీ ఇచ్చారు. 

మాసాన్ పల్లి రోడ్డు కూడా మంజూరు చేయిస్తా… ప్రజల కోసం ఆయన కోరిన కోరికలు తీర్చుతాను భూపాల రెడ్డి ఎమ్మెల్యే అయిన దగ్గర అయిన దగ్గర నుంచి నారాయణ ఖేడ్ దశ, దిశ మారిపోయింది. నారాయణఖేడ్‌లో ఎక్కువగా ఉండి మీ సేవలో ఉంటడు. నారాయణ ఖేడ్ ఎక్కువగా అభివృద్ధి చెందింది. ఓట్లు వచ్చినప్పుడు ఆగం కావద్దని సూచించారు. గత పాలకుల పాలనలో ఎట్లా ఉండే. ఇప్పుడు ఎట్ల ఉండే అని అడిగారు. 

కర్ణాటక మీ పొరుగున్నే ఉంటది. కర్ణాటక రైతుల గతి ఏమవుతున్నదో మీకు తెలుసే ఉంటది. నేను చెప్పాల్సిన అవసరం లేదు.  మాసిఫాయితనానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వచ్చి 5 గంటలు కరెంటు ఇస్తామని చెబుతున్నాడు . సిగ్గుండాలే చెప్పడానికి. 24 గంటలు ఇచ్చే రాష్ట్రం వచ్చి అలా మాట్లాడితే దేనితోటి నవ్వాలే. 

కాంగ్రెస్ పార్టీ  దద్దమ్మలు గెలువడం చేతకాక ప్రభాకర్ రెడ్డి మీద కత్తుల పట్టి దాడులు చేసిండ్లు. ప్రచారం చేస్తుంటే పొడిచిండ్లని వెల్లడించారు. మూడు ఇంచుల లోతుకు కత్తి దిగింది. దేవుని దయవల్ల ప్రాణాపాయం లేకుండా పోయింది. హరీశ్ రావు దగ్గరుండి చూసుకుంటున్నాడు.యశోద హస్పటల్ లో చేర్చారు. కార్తకర్తలు రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. భూపాల్ రెడ్డి గారు నారాయణఖేడ్ చరిత్రలో నే మంచి నాయకుడు. మీ కోసం పరితపిస్తాడు. భూపాల్ రెడ్డిని ఆశీర్వదించండి. పెద్ద మెజారిటీతో గెలిపించండని విజ్ఞప్తి చేసారు. 

మళ్లీ వచ్చి బసవేశ్వర లిఫ్టు ఇరిగేషన్ ప్రారంభిస్తాను. మీ స్కూల్లన్నీ పెట్టించే బాధ్యత తీసుకుంటున్నాను. చేతకాని కాంగ్రెస్ దద్దమ్మలు, ఇదే హింస అనుకుంటే మాకు తిక్కరేగితే ఏం జరుగుద్దో ఊహించుకోవాలే. ఇట్ల గాకుండా హింసకు తెగబడుతున్నరు. హింసకు తలపడాలంటే అభ్యర్థుల మీద కత్తిపట్టుకుని ఎవ్వడికి పొడవరాదు? అదే పని మనం చేయాలనుకుంటే మనం చేయలేమా? అని అడిగారు.  పది సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ప్రజల పనులు చేసినమని తెలిపారు. పేదలను ఆదుకున్నామని సీఎం ప్రసంగించారు.