
తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సవాల్ను మేము స్వీకరించాము. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని నేను చెప్పాను అని అన్నారు.
అనిల్ కుమార్ యాదవ్ ఎవరికి చెప్పకుండా హాస్పిటల్కు వెళ్లారు. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంపీలు టెస్ట్కు రావాలని చెప్పాను. మాకు చెప్పకుండా వెళ్లి రమ్మంటే ఎట్లా? అని అడిగారు.
అనిల్ కుమార్ యాదవ్ నాకు మంచి మిత్రుడు. నేను అనిల్ కుమార్ యాదవ్ను తిట్టవచ్చు వార్డు మెంబర్గా గెలవడని.. కానీ నా పంచాయతీ అనిల్ కుమార్ యాదవ్తో కాదు. రేవంత్ రెడ్డితో నాకు పంచాయతీ అని తెలిపారు
డ్రగ్స్ కేసులో నన్ను ఇరికించాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. మేము కౌశిక్ రెడ్డిని ట్రాప్ చేయలేదని ఇంటిలిజెన్స్ చీఫ్ను ప్రెస్ మీట్ పెట్టి చెప్పమను అని సవాల్ విసిరారు.
నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా.. రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో డ్రగ్స్ టెస్ట్కు రావాలి. మేము డబ్బా పట్టుకుని రెడీగా ఉన్నాం. మా ఎమ్మెల్యేలు అందరు వెయిట్ చేస్తున్నారు.. ఇప్పటి వరకు మమ్మల్ని పిలవలేదు అని కౌశిక్ రెడ్డి అన్నారు.
ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి డ్రగ్స్ గురించి మాట్లాడితే చిత్తశుద్ధితో మాట్లాడాలి. నన్ను ట్రాప్ చేసినట్లు రాజ్ పాకాల కుటుంబాన్ని ఇరికించాలని చూశారు అని పేర్కొన్నారు.
కేసీఆర్ పేరు తలుచుకోకుండా రేవంత్ రెడ్డి మీటింగ్ అయిందా. కేసీఆర్ పేరు తుడిస్తే చెరిగేది కాదు. రేవంత్ రెడ్డి పాలనలో ఒక్క వర్గం సంతోషంగా లేదు. రెండు లక్షల కోట్లు రైతులపై కేసీఆర్ ఖర్చు పెట్టారు. కేసీఆర్ పాలనలో లక్షా 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము. దేశంలో తుగ్లక్ సీఎం రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు.