mt_logo

కాళేశ్వరం ప్రాజెక్ట్ తో ఎండ కాలంలో కూడా నిండుకుండలా చెరువులు

సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్ట్ తో ఎండ కాలంలో కూడా నిండుకుండలా చెరువులు నిండుగా ఉన్నాయన్నారు మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట రూర‌ల్ మండలం రాఘవాపూర్ రైతు వేదికలో 24 గంటల కరెంటు, కాంగ్రెస్ పార్టీ వాఖ్యలపై నిర్వహించిన రైతు సమావేశంలో హాజరై మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో పేలిపోయే ట్రాన్స్ఫార్మర్స్, కాలిపోయే మోటార్లు ఉండేవన్నారు.  తెలివి లేని కాంగ్రెస్ నాయకులు 3 గంటల కరెంట్ సరిపోతదంటున్నారు. రైతులు ఆలోచించాలి 3 గంటల కరెంటు అందించే పార్టీ కావాలా.? 3 పంటలకు 24 గంటల ఉచిత కరెంటు అందించే బీఆర్ఎస్ బి ప్రభుత్వం కావాలో ఆలోచన చేయండని చెప్పారు. ఇప్పటి వరకు రైతు బంధు కింద 11 విడతల్లో 72 వేల కోట్లు అందించిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు. 

24 గంటల కరెంట్ కోసం ప్రతి యేటా 12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో ఎండ కాలంలో కూడా పెద్ద చెరువు నిండుకుండలా నిండింది. రాఘవాపూర్ గ్రామంలో 40 మంది రైతులకు రైతు బీమా అందించాం అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1 లక్ష 6 వేల 74 మంది రైతులకు రైతు బీమా అందించాం అని గుర్తు చేసారు. చంద్రబాబు నాయుడు వారసుడు రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు, ఒకనాడు బతుకుదెరువు కోసం తెలంగాణ వాళ్ళు పక్క రాష్ట్రాలకు పోతే, ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి వరి నాట్లు వేయడానికి కార్మికులు వలస వచ్చే స్థితికి తెలంగాణ చేరిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం ప్రతి ఒక్క రైతు ఆలోచించాలన్నారు.