mt_logo

తెలంగాణ సంబురాల పేరుతో తెలంగాణవాదులను జిట్టా ఏకం చేశాడు: హరీష్ రావు

తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు.

తెలంగాణ మలిదశ ఉద్యమ సహచరుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డి గారి మరణం నన్ను కలచివేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన అనేక పోరాటాల్లో కలిసి పనిచేశాం. భువనగిరి ప్రాంత ప్రజల కోసం జిట్టా ఎంతో తపనపడ్డారు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు అని గుర్తు చేసుకున్నారు.

రాష్ట్రంలో యువజన సంఘాల సమాఖ్యను ఏర్పాటు చేసి యువతను ఏకం చేసే ప్రయత్నం చేసారు. బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం పటిష్టానికి కృషి చేశారు అని అన్నారు. తెలంగాణ సంబురాల పేరుతో సాంస్కృతిక ఉత్సవాలు చేసి తెలంగాణవాదులను ఏకం చేసాడు అని కొనియాడారు.

చిన్న వయసులోనే ఆయన మనకు దూరం కావడం బాధాకరం. బాలకృష్ణారెడ్డి గారి మరణం తీరని లోటు. అయిన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము అని హరీష్ రావు అన్నారు.