mt_logo

రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, డిప్యూటీ స్పీకర్ శ్రీ పద్మారావు గౌడ్ , ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్, జిల్లా ఎమ్మెల్యేలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 గంటల వరకు సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించి, పద్మనాయక మండపంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల మానేరు కరకట్ట వద్ద పర్యాటక శాఖ ద్వారా ఏర్పాటు చేసిన నూతన బోటును ప్రారంభిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు సిరిసిల్ల బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన కే కన్వెన్షన్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. తదనంతరం సాయంత్రం 5 గంటలకు జిల్లా ఆసుపత్రిలో 40 కేవీ రూప్ టాప్ సోలార్ ప్లాంట్, 130 అదనపు బెడ్స్, డే కేర్ కీమోథెరఫీ డేకేర్‌ సెంటర్‌ను ప్రారంభిస్తారు.