


ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మంత్రి కేటీఆర్కి నామినేషన్ కోసం 1000 రూపాయలు చొప్పున 1 లక్ష రూపాయలు సేకరించి విరాళంగా ఇచ్చారు ముఖరా(కే) గ్రామానికి చెందిన 100 మంది పింఛన్ దారులు.
తమకు కేసీఆర్ పింఛనే ఆసరా అని, తమకు పెద్ద కొడుకులా నెల నెల పింఛన్ ఇచ్చి మా బ్రతుకుకు భరోసాగా నిలుస్తుండని, మా వంతు కృషిగా కేసీఆర్ సారుకు మరియు కేటీఆర్ సారుకు నామినేషన్ కోసం 1000 రూపాయలు చొప్పున విరాళం ఇస్తున్నామన్నారు.
జీవితాంతం కేసీఆర్ సారుకి రుణపడి ఉంటామని అన్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు మంత్రి కేటీఆర్ గారికి తమ విరాళం 1 లక్ష రూపాయలు అందించాలని సర్పంచ్ గాడ్గే మీనాక్షికి ఆ మొత్తాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గాడ్గే సుభాష్ మరియు పింఛన్ దారులు పాల్గొన్నారు.