mt_logo

మెర్క్యురియల్ రైజ్ ఆఫ్ తెలంగాణ’ బుక్ ని విడుదల చేసిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తొమ్మిదేండ్ల కాలంలో అన్ని రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని నివేదిస్తూ ఫోటోలు, సమాచారంతో, సీఎం కేసీఆర్ సూచనలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి  కుమారి నేతృత్వంలో, తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ ‘మెర్క్యురియల్ రైజ్ ఆఫ్ తెలంగాణ’ (Mercurial Rise of Telangana) ను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు సచివాలయంలోని తన  ఛాంబర్ లో ఆవిష్కరించారు.

 ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు టి.హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం ప్రధాన సలహాదారులు సోమేశ్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు ముషరఫ్, హరిచందన తదితరులు ఉన్నారు. తొలి కాపీలను ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి లకు సీఎస్ శాంతి కుమారి అందజేశారు.