mt_logo

చంద్రబాబు ఏజెంట్ రేవంత్ : రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి

  • కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ
  • రైతుల పొట్ట కొట్టే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడాడు
  • చంద్రబాబు రేవంత్ ఇద్దరు ఒక్కటే
  • రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ లోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డిపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్తుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా, రైతులకు 3 గంటలు కరెంటు ఇవ్వాలని రేవంత్ స్పష్టంగా చెప్పాడు.రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రైతులపై  కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న పనులు అర్ధం పర్ధం లేవు

రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా, మతిభ్రమించి వ్యాఖ్యానాలు చేస్తున్నాడు. వ్యవసాయం, రైతుల గురించి రేవంత్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదు. కాంగ్రెస్ పార్టీ, వారి నాయకులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎందుకు సమర్ధిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. సాగునీటి రంగంపై గత పాలకుల నిర్లక్ష్యంతో  తెలంగాణ లో బోర్లు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలు కాకుండా 30 లక్షల కరెంటు మోటార్లు ఉన్నాయి. వీటి కింద 70 నుంచి 80 లక్షల ఎకరాలు సాగులో ఉన్నది. రైతుల పొట్ట కొట్టే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడాడు. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. సిగ్గు లేకుండా ధర్నాలు చేస్తామని చెబుతున్నారు.తమ తప్పు కప్పిపుచ్చడానికి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న పనులు అర్ధం పర్ధం లేవు.హైదరాబాద్ చుట్టూ పక్కల రైతులను భయపెట్టి భూ కబ్జాలు చేసే వ్యక్తి రేవంత్ రెడ్డి. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్, వ్యవసాయాన్ని దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అయితే దాన్ని పండుగ చేసింది కేసీఆరే అని స్పష్టం చేసారు.

బషీర్ బాగ్ కాల్పులకు ఆద్యుడు చంద్రబాబు

బషీర్ బాగ్ కాల్పులకు ఆద్యుడు చంద్రబాబు నాయుడే అని అన్నారు. నేను ఆ రోజు అసెంబ్లీలో ఉన్నాను. చంద్రబాబు డైరెక్షన్ లోనే రేవంత్ నాటకాలు ఆడుతున్నాడు. TPCC పదవిని రేవంత్ కు ఇప్పించిందే చంద్రబాబు. చంద్రబాబు తన మనిషి రేవంత్ ద్వారా మళ్ళీ సీమాంధ్ర కుట్రలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే దానికి బొంద పెడతాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఏ మీటింగ్ లో కూడా రేవంత్ రెడ్డి ఎప్పుడు మెడలో కాంగ్రెస్ కండువా వేసుకోడు. చంద్రబాబు ఏజెంట్ రేవంత్. చంద్రబాబు రేవంత్ ఇద్దరు ఒక్కటే. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపర్చడానికి ప్రజలే కాదు కాంగ్రెస్ కార్యకర్తలే సిద్ధంగా లేరు. కరెంటు పై చంద్రబాబును ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తి కేసీఆర్. కరెంట్ చార్జీల పెంపుదలను వ్యతిరేఖంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉత్తరం రాశారని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.