mt_logo

మలేషియాలోని కౌలాలంపూర్ సిటీ సెంటర్‌లో బతుకమ్మ ఆట పాటలు

75వ భారత గణతంత్ర దినోత్సవంలో భాగంగా హై కమిషనర్ అఫ్ ఇండియా బి.న్ రెడ్డి కౌలాలంపూర్ సిటీ సెంటర్‌లో విందును ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పండుగల విశిష్టతను వివరిస్తూ కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ఆట పాటలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మలేషియా ఫైనాన్స్ మినిస్టర్ దాతుశ్రీ అమిర్ హాంజా, డిప్యూటీ మినిస్టర్ అఫ్ యూనిటీ సరస్వతి కందస్వామి, కుల సేకరేన్ డిప్యూటీ మినిస్టర్ ఇన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, ఫెడరల్ మాజీ డిప్యూటీ మినిస్టర్ దాతో లోగ బాల మోహన్ మరియు ఇతర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.