mt_logo

బీఆర్ఎస్‌లోకి ఆంధ్ర ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ నాయకుడు

ఆంధ్ర ప్రదేశ్ ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకి ఆదరణ పెరుగుతోంది …ఆంధ్ర ప్రదేశ్ బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తలారి సురేష్ సారధ్యంలో హైదరాబాద్ లోనూ ఏపీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చేరికలు జరిగాయి. తాజాగా కాకినాడ జిల్లాకి చెందిన పి.సత్యనారాయణ (యూత్ కాంగ్రెస్ కార్యదర్శి), అలాగే గుంటూరు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు షేక్ ఖాజావలి సారథ్యంలో యర్రగొండుపాలెం కి చెందిన ధూపాటి చంద్రబాబు, విజయబాబు, అంబ్రిష్, బాల యేసు, సర్దక్ సహా పలు జిల్లాకి చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. వారిని ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్ర శేఖర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా తోట మాట్లాడుతు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఏపీలో ప్రజలు ఎవరు సంతృప్తిగా లేరని, రాష్ట్ర ప్రజలు మార్పు కోరుతున్నారని వచ్చే ఎన్నికల్లో వైకాపా కి తగిన బుద్ధి చెప్తారని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గిద్దా శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.