mt_logo

రేవంత్ తనకు తాను గొప్ప నాయకుడు అని ఊహించుకుంటున్నాడు : మంత్రి వేముల

మహబూబ్ నగర్ జిల్లా: దేవరకద్రలో 24 కోట్ల 67 లక్షలతో నూతనంగా నిర్మించిన రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని, నుతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి.

రేవంత్ వ్యవహారం ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు

అనంతరం… దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన సభలో పాల్గొన్న రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. భారీగా పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, కరువు తప్ప అభివృద్ధి తెలియని జిల్లా పాలమూరు .కాంగ్రెస్, బీజేపీ పార్టీ లు వలసల జిల్లా గా పాలమూరును మార్చారు, డెబ్భై ఏండ్ల పాలనలో కరువు,వలసలు మాత్రమే పాలమూరు జిల్లా చూసింది.ఇప్పుడిప్పుడే పాలమూరు పచ్చబడుతుందన్నారు. పెండింగ్ ప్రాజెక్ట్ లను సీఎం కేసీఆర్ పూర్తి చేశారన్నారు. పాలమూరు లో వేరే రాష్ట్రం నుండి కూలీలు వచ్చి నాట్లు వేస్తున్నది నిజం కాదా? సీఎం కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ లో మొట్టమొదటి సమీక్ష పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద చేశారు..రేవంత్ వ్యవహారం ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు. 

నరేంద్రమోదీ ఒక  అసమర్ధ ప్రధాని

రేవంత్ తనకుతాను గొప్ప నాయకుడు అని ఊహించుకుంటున్నాడు.పిచ్చి మాటలు మానుకోవాలని రేవంత్ ను హెచ్చరిస్తున్నానన్నారు.చట్టం అడ్డంపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తూ రాజకీయాలు చేస్తాడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఎంపీ పదవి తీసేస్తే చప్పుడు లేదన్నారు.నరేంద్రమోదీ ఒక  అసమర్ధ ప్రధాని ధరల పెరుగుదల, రూపాయి విలువ పడిపోవడం నరేంద్రమోదీ పనితనం,పెట్రోల్ ,డీజిల్  ధర డబుల్ చేసిన ఏకైక ప్రధాని మోడీ.మన ఎల్ ఐ సి డబ్బులు అదాని కంపెనీలో పెట్టుబడి పెడుతున్నారన్నారు. ప్రజల డబ్బును ప్రైవేట్ కంపెనీ లో పెట్టడానికి మోడీ ఎవరు? ప్రైవేట్ కంపెనీలకు లబ్ది చేకూరుస్తూ వారు ఇచ్చిన డబ్బులతో ఎమ్మెల్యే లను కొంటున్నాడు, కేసీఆర్ మన సంక్షేమం కోసం డబ్బులు పంపిస్తుంటే మోడీ మన డబ్బులు తిరిగి తీసుకుంటున్నాడని అన్నారు.