mt_logo

ప్రగతి నిరోధకులు ప్రతిచోటా వుంటారు.. నాడు దేవుండ్లకే తప్పలేదు : మంత్రి కే.టి. రామారావు

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ : దివిటిపల్లి వద్ద సుమారు 270 ఎకరాల్లో నిర్మిస్తున్న అమరరాజా బ్యాటరీ కంపెనీకి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ.. దివిటిపల్లికి ఆడబిడ్డగా వచ్చిన ఉమ్మడి రాష్ట్రంలో మాజీ మంత్రి గల్లా అరుణ గారికి చప్పట్లతో స్వాగతం పలుకుదాం. తెలంగాణ ఎందుకు అని నన్ను అడిగిన అరుణక్కకు ఉమ్మడి శాసన సభలో మీము చెప్పిందే నేడు నిజమైందన్నారు. తెలంగాణ కు భారీ పరిశ్రమను తెచ్చిన అమర్ రాజా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు నమస్కారాలు..పాలమూరు జిల్లా స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులందరికీ అభినందనలు తెలియజేసారు. 

అమర్ రాజా వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు

పోటీ పరిశ్రమలో ఒక పరిశ్రమ రాష్ట్రానికి రావాలంటే ఇతర దేశాలతో పోటీ పడాల్సివుంటుందన్నారు. వారిని ఒప్పించి మెప్పించి తేవాల్సివుంటుంది, మాదగ్గరికి రమ్మంటే మాదగ్గరికి రమ్మని రాష్ట్రాలు ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తారన్నారు. మనకున్న అతిపెద్ద అస్సెట్ యువశక్తి..142 కోట్లల్లో 70 కోట్లమంది 27 ఏండ్ల లోపున్నారు. భారతదేశానికున్న అడ్వాంటేజ్ మరే దేశంలోనూ లేదన్నారు. ఏ రాష్ట్రంలోనైనా సరే ప్రయివేట్ రంగంలో భాగస్వామ్యం కుదుర్చుకుని పరిశ్రమల స్థాపన ద్వారానే అభివృద్ధి సాధ్యమన్నారు. ఒక్క ఈ పరిశ్రమ ద్వారా డైరక్టుగా పరోక్షంగా ఉద్యోగాలు ,అనుబంధ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అమర్ రాజా వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు,  త్రిపుల్ ఎఫెక్ట్ ద్వారా చుట్టుపక్కల ఉపాధి అవకాశాలు రెట్టింపు అవుతాయన్నారు. 

నాడు దేవుండ్లకే తప్పలేదు

    పదేండ్లల్లో 9,500 కోట్ల పెట్టుబడి దశలవారీగా పెడుతుంది. వారి 37 ఏండ్లలొ పెట్టిన దానికి రెట్టింపు పెట్టుబడిని ఇక్కడ పెడుతున్నారు. మేము ఎంతో కష్టపడి తెస్తున్నం. కానీ ప్రగతి నిరోధకులు ప్రతిచోటా వుంటరు. నాడు దేవుండ్లకే తప్పలేదు మనం అంతకన్నా గొప్పవాల్లం కాదు అన్నారు. ఇక్కడ కాలుష్యం వస్తుందని చిల్లర మాటలు మాట్లాడే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఉంది…అదేంటంటే లిథియం అయాన్ బ్యాటరీ….లెడ్ ఆక్సైడ్ బ్యాటరీ ఒకటి కాదు. భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు అవే ఇక్కడ తయారవుతాయి. ఇక్కడ తయారయ్యే బ్యాటరీలన్నీ లిథియం బ్యాటరీలే. జీరో లిక్విడ్ డిశ్చార్చ్ తో అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేస్తాం.

33 హుస్సేన్ సాగర్ల నీల్లు అందుబాటులోకి వస్తాయి

చిత్తూరు తదితర ప్రాంతాల్లో ఒక్క చుక్క కాలుష్యం లేదు..ఇంకా అనుమానం వుంటే,10 బస్సులు పెట్టి అక్కడ పంపండి, అక్కడి చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎంత గొప్పగా మారినాయో చూస్తారన్నారు. ఇక్కడే ఇల్లు కట్టుకోని ఉంటారు జయదేవ్.అని ఆశిస్తున్నాను, అనవసరంగా చిల్లర మాటలు మాట్లాడేవాళ్లు. మీరు మనసు మార్చుకుని నిర్మాణాత్మకంగా వ్యవహరించండన్నారు. సి ఎస్ ఆర్ అనే ఆలోచన తో అక్కడి ప్రాంతాన్ని చుట్టుపక్కల గ్రామాల ఆర్థిక పరిస్థితి మెరుగయ్యిందన్నారు. 16 గిగావాట్లు హవర్ ప్లాంటు. మొక్క గిగా 5 లక్షల టూవీలర్స్ 35 వేల కార్లకు బ్యాటరీలందుతాయి. 10 వేల కొలువులు ప్రత్యక్షంగా పరోక్షంగా మరికొన్ని వేల మందికి. ఫ్యాక్టరీ నిర్మాణం సాగుతుండగానే ఇక్కడ స్థానికులకు అర్హతకు తగ్గట్టు స్కిల్ డెవలప్ చేసి ఉద్యోగాలు కల్పిస్తాం అన్నారు. వెనకబడేయబడ్డ పాలమూరు జిల్లాకు కుడిపక్కన కరివేన  ఎడమన ఉద్దండాపూరు మొత్తం 33 టిఎంసీల కెపాసిటీ అంటే 33 హుస్సేన్ సాగర్ల నీల్లు అందుబాటులోకి వస్తాయి, అత్యాధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్ పోర్టు కూడా ఇక్కడ నుంచి గంట దూరంలోనే వున్నదన్నారు.