mt_logo

వినేటోడు వెర్రిబాగులోడు అయితే చెప్పేటోడు చంద్రబాబు

వినేటోడు వెర్రిబాగులోడు అయితే చెప్పేటోడు చంద్రబాబు అని ఇప్పుడు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నరు. కొండంత రాగం తీసిన తెలుగు దేశం పార్టీ అఖిలపక్షంలో కొత్తగా చెప్పిందేమీ లేకపోగా ఏదో పొడిచేశామని తెలంగాణ తెదేపా నాయకులు ఇక్కడ శిగాలు ఊగుతున్నారు.

చంద్రబాబు పంపిన సీల్డ్ కవర్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉపకరించే మాట ఒక్కటంటే ఒక్కటి లేకపోగా ఒక పచ్చి అబద్ధం ఉన్నది. అదే ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖలోని అంశాలకు కట్టుబడి ఉన్నామనడం.

ఇవ్వాళ ఈ లేఖను డిల్లీకి మోసుకుపోయిన యనమల రామకృష్ణుడు స్వయంగా గత యేడాది మీడియాతో మాట్లాడుతూ 2008 నాటి లెటర్ ఇప్పుడు పనికిరాదని, 2011 మహానాడులో తెలంగాణపై తీసుకున్న వైఖరే ఫైనల్ అని తేల్చాడు. ఒకసారి ఈ వీడియో చూడండి.

ఇంతకూ 2011 మహానాడులో తెలుగుదేశం పార్టీ తెలంగాణపై ఏం నిర్ణయం చేసిందని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదు. తెలంగాణ అంశాన్ని కేంద్రం సత్వరమే పరిష్కరించాలని కేంద్రాన్ని తెదేపా డిమాండ్ చేసిందా సభలో.

ఇదే విషయం మీద 29 జులై నాడు ఆంధ్రజ్యోతి పత్రికలో యనమల రామకృష్ణుడు ఏమన్నాడో చూడండి:

2009 డిసెంబర్ 7 నాడు అఖిలపక్షంలో లిఖితపూర్వకంగా తెలంగాణ తీర్మానానికి మద్ధతు ఇస్తామన్న తెలుగుదేశం పార్టీ మూడు రోజుల్లోనే నిర్ణయం మార్చుకుంది. అట్లాంటి దగుల్బాజీ పార్టీ ఇప్పుడు 2008 లో రాసిన లెటర్ కు కట్టుబడి ఉన్నామని దొంగమటలు చెబితే నమ్మేటోడెవడు?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *