mt_logo

వరంగల్ లో మోగనున్న తెరాస “తెలంగాణ విజయ గర్జన” : మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి రెండు దశాబ్దాలు కావస్తున్న నేపథ్యంలో.. పార్టీ సాధించిన విజయాలకు గుర్తుగా ‘తెలంగాణ విజయ గర్జన’ పేరుతో వరంగల్ నగరంలో భారీ సభను ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మీడియా కార్యక్రమంలో వెల్లడిస్తూ.. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పార్టీని ఏర్పాటు చేసి, అనేక సవాళ్లను ఎదుర్కొని, ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తూ, స్వరాష్ట్రాన్ని సాధించిన పార్టీగా టీఆర్ఎస్ నిలిచింద‌ని తెలిపారు. రాష్ట్రాన్ని సాధించుకున్నాక అద్భుతమైన విధానాలతో పరిపాలన ప్రస్థానాన్ని, రాష్ట్ర అభివృద్ధిని కొనసాగిస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను నవంబర్ 15వ తేదీన వరంగల్‌లో నిర్వహిస్తామ‌ని తెలియజేశారు. తెలంగాణ విజయ గర్జన పేరుతో జరిగే ఈ సమావేశానికి పార్టీ గ్రామ, వార్డు, మండల, పట్టణ, డివిజన్ కమిటీలు, ఆయా అనుబంధ కమిటీల సభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు మరియు లక్షలాదిగా ప్రజలు హాజరవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ బహిరంగ సభకు సంబంధించి సన్నాహక సమావేశాలను ప్రతి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో అక్టోబర్ 27న‌ నిర్వహిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *