mt_logo

స్టీల్ బ్రిడ్జ్‌కి నాయిని నరసింహారెడ్డి ఫ్లై ఓవర్‌గా నామకరణం

  • హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు నిర్మాణం చేసిన స్టీల్ బ్రిడ్జ్‌కి నాయిని నరసింహారెడ్డి ఫ్లై ఓవర్‌గా నామకరణం
  • ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్న పురపాలక శాఖ
  • ముషీరాబాద్‌లో సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో, జీఎస్టీ  కార్మిక సంఘం నాయకుడిగా నాయిని గారు చేసిన సేవలు స్మరించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

హైదరాబాద్‌లో ప్రజా రవాణాలో మరో మైలురాయి చేరనున్నది. సుమారు 450 కోట్ల రూపాయలతో నిర్మించిన పొడవైన స్టీల్ బ్రిడ్జి ఈనెల 19వ తేదీన పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభం కానున్నది. 2.63 కిలోమీటర్ల పొడవైన ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ  స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్రోగ్రాం ఎస్ఆర్డీపీ లో భాగంగా చేపట్టింది. 

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి హోం శాఖ మంత్రిగా పనిచేసిన కీర్తిశేషులు నాయిని నరసింహారెడ్డి పేరును ఈ స్టీల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ కి పెట్టనున్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు ఈ స్టీల్ బ్రిడ్జీకి నాయిని గారి పేరు పెడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.  ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఆదేశాలను జారీ చేయనున్నది. సుదీర్ఘ కాలం పాటు ముషీరాబాద్ కేంద్రంగా రాజకీయాల్లో పాల్గొని తెలంగాణ ఉద్యమానికి అనేక సేవలందించిన నాయిని నర్సింహారెడ్డి, అక్కడే ఉన్న వీఎస్టీ ఫ్యాక్టరీ కార్మికుల యూనియన్ నాయకుడిగా దశాబ్దాల పాటు పనిచేశారు. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్రాంతాల్లో నాయిని గారి సేవలను దృష్టిలో ఉంచుకొని నాయిని నరసింహారెడ్డి పేరును ఈ స్టీల్ బ్రిడ్జికి పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.