mt_logo

యాదగిరిగుట్ట అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష..

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఉదయం బేగంపేట ఎయిర్ పోర్టునుండి ప్రత్యేక హెలికాప్టర్ లో యాదగిరిగుట్టకు చేరుకున్నారు. సీఎం గుట్టకు చేరుకోగానే ఆలయ కమిటీ అధికారులు, ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి ప్రత్యేకపూజలో పాల్గొన్న అనంతరం సీఎం కేసీఆర్ ఆలయ అభివృద్ధిపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష జరిపారు. గుట్ట పరిసర ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి ఆలయ అభివృద్ధికి సంబంధించిన నివేదికలు, ప్రణాళికలపై సీఎం చర్చించారు.

నల్గొండ జిల్లా పర్యటన ముగిసిన తర్వాత సీఎం మెదక్ జిల్లాకు బయలుదేరి వెళ్ళారు. కొచ్చారం మండలం ఘనపూర్ చేరుకొని ఏరియల్ సర్వే ద్వారా ఘనపూర్ ఆయకట్టను పరిశీలించిన సీఎం అధికారులతో సమీక్ష జరిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *