mt_logo

టీ్ఎస్‌పీఎస్సీ చైర్మన్ గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి..

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో 169 ని జారీ చేసింది. కమిషన్ సభ్యులుగా తెలంగాణ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సీ విఠల్, మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి, ప్రముఖ విద్యావేత్త మతీనుద్దీన్ ఖాద్రీలను నియమించారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదా కలిగిన సీనియర్ అధికారి సుందర్ అబ్నార్ ను టీ్ఎస్‌పీఎస్సీ కార్యదర్శిగా నియమిస్తూ మంగళవారమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

గురువారం ఉదయం అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన అనంతరం వీరు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారని తెలిసింది. సకలజనుల సమ్మెకు నాయకత్వం వహించిన ముఖ్యనాయకులకు ఈ పదవులు లభించడం పట్ల ఉద్యోగసంఘాల నేతలు, తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కమిషన్ సభ్యులు ఆరేళ్ళపాటు పదవుల్లో కొనసాగుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *