mt_logo

లండన్ లో ఘనంగా “టాక్ – చేనేత బతుకమ్మ మరియు దసరా” సంబురాలు

– ప్రవాస తెలంగాణ ఆడబిడ్దలకు కేటీఆర్ ప్రత్యేక చేనేత గౌరవం

– ప్రత్యేక ఆకర్షణగా చార్మినార్ ఆకృతితో పూలతో అలంకరించిన ప్రతిమ

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్ లో చేనేత బతుకమ్మ – దసరా సంబురాలు ఘనంగా జరిగాయి. ఈ సంబురాలకు యుకే నలుమూలల నుండి వెయ్యి కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, అదే స్ఫూర్తితో రాష్ట్ర ఆపదర్మ మంత్రి కేటి. రామారావు గారి కృషికి మా వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ఈ సంవత్సరం కూడా వేడుకలను “చేనేత బతుకమ్మ మరియు దసరా” గా జరుపుకున్నామని సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం తెలిపారు.

మా పిలుపు మేరకు హాజరైన ప్రవాసులు చేనేత బట్టలు ధరించి పాల్గొనడం మాకెంత సంతోషాన్ని మరియు స్ఫూర్తినిచ్చిందని టాక్ ఈవెంట్స్ ఇన్‌చార్జ్ అశోక్ గౌడ్ దూసరి తెలిపారు.

కల్చరల్ ఇన్‌చార్జ్ సత్య చిలుముల మాట్లాడుతూ, దసరా పండుగ సందర్భంగా స్వదేశం నుండి తెచ్చిన శమీ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన దసరా “అలాయ్ – బలాయ్” కార్యక్రమంలో, చేనేత శాలువాలను ఒకరికొరకు పరస్పరం వేసుకొని, జమ్మి (బంగారం)ని ఇచ్చి పుచ్చుకొని శుభాకాంక్షలు తెలుపుకొని, చేనేతకు చేయూతగా వీలైనన్ని సందర్భాల్లో చేనేత బట్టలు దరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. హాజరైన ప్రవాస సంఘాల ప్రతినిదులు ఐక్యతను చాటుతూ మనమంతా ఒకటే అంటూ చేయి చేయి కలిపి అభివాదం చేశారు.

జమ్మి ఆకులు పంచుకుంటూ లండన్ పట్టణానికి ‘అలాయ్ బలాయ్’ ల తెలంగాణ స్నేహమాధుర్యాన్ని ప్రత్యక్షంగా రుచి చూపించారని పలువురు ప్రశంశించారు.

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ మరియు దసరాపండగ సందర్భంగా మహిళలందరు భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ బద్దంగా గౌరీ దేవికి పూజలు జరిపి బతుకమ్మ ఆట పాటలతో, కోలాటాల నృత్యాలతో, చప్పట్లు కలుపుతూ, రంగు రంగుల బతుకమ్మలతో సందడి చేసారు.

బతుకమ్మల మధ్య చార్మినార్ ఆకృతితో పూలతో అలంకరించిన ప్రతిమ వేడుకలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఆతుథులందరి ప్రశంసలందుకోవడం జరిగింది.

విదేశాల్లో స్థిరపడ్డా కాని తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరిని ఆకట్టుకుంది. చిన్నారులు సైతం ఆటల్లో పాల్గొనడమే కాకుండా, చిన్న చిన్న బతుకమ్మలతో సంబురాలకు కొత్త అందాన్ని తెచ్చారు.

ఈ కార్యక్రమంలో భారత హై కమిషన్ ప్రతినిధి అమిత్ శర్మతో పాటు ప్రవాస సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు, చేనేత పేరుతో బతుకమ్మ వేడుకల్ని నిర్వహించడం వినూత్నంగా ఉందని, వీరి ప్రయత్నం ఫలించి నేత కుటుంబాలకు మేలు జరగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.

సంప్రదాయ తెలంగాణ వంటకాలతో పండగ భోజనం సొంత ఇంటిని తలిపించిందని హాజరైన వారు అభిప్రాయపడ్డారు.

టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ గత సంవత్సరం కూడా చేనేతకు చేయూతగా మా వేడుకలని చేనేత బతుకమ్మ సంబురాలుగా చేయడం ద్వారా ఎన్నో నేతన్న కుటుంబాలకు మేలు జరిగిందని, ఈ సంవత్సరం మా ప్రయత్నాన్ని అభినందిస్తూ కేటీఆర్ గారు ప్రత్యేకంగా చేనేత శాలువాలు పంపి ప్రవాసులను ముఖ్యంగా బతుకమ్మలో పాల్గొన్న ఆడబిడ్దలను గౌరవించడం మాకెంతో స్ఫూర్తినిచ్చింది. ఈ సందర్భంగా కేటీఆర్ గారి ఔదార్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

వీలైనంత వరకు ప్రవాసులల్లో చేనేత పై అవగాహన కలిపించి, వీలైనన్ని సందర్భాల్లో చేనేతవస్త్రాలు ధరించి నేత కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నట్టు తెలిపారు.

టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది మాట్లాడుతూ ఈ వేడుకలలో భాగంగా గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నట్టు పండుగకి వచ్చే ప్రతీ ఒక్కరిని చేనేతవస్త్రాలు ధరించాలని కోరామని అలాగే చాలామంది ఈ రోజు చేనేత వస్త్రాలు ధరించడం సంతోషంగా వుందని అన్నారు. పండగకు అడబిడ్దలను చేనేత శాలువాలతో సత్కరించిన మా కేటీఆర్ అన్నకు, యూకే అడబిడ్దల తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

టాక్ సంస్థ ఆవిర్భావం నుండి నేటి వరకు అన్ని సందర్భాల్లో వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న ఎంపీ కవిత గారికి ప్రత్యేక కృతఙతలు తెలిపారు. ఎంపీ కవిత గారితో కేవలం పోస్టర్ ఆవిష్కరణ మాత్రమే కాకుండా, వారి ఆలోచలనకు ఆశయాలకు అనుగుణంగా మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి అన్నిరకాలుగా కృషి చేస్తామని, ఎప్పటికప్పుడు వారి సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని తెలిపారు.

వేడుకలకు వచ్చిన ప్రవాసులు టాక్ సంస్థ ప్రతినిధులను ఉద్దేశించి ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్తున్న టాక్ సంస్థని ప్రశంసించారు. ఒక పక్క వ్యక్తిగతంగా ఇక్కడున్న బిడ్డలు రోజు వారి పనుల్లో బిజీగా ఉన్నపట్టికి, బాధ్యత గల తెలంగాణ బిడ్డలుగా ఆనాడు ఉద్యమంలో నేడు పునర్నిర్మాణంలో పోశిస్తున్న పాత్ర ఎందరికో ఎంతో స్ఫూర్తినిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టాక్ వ్యవస్థాపకుడు మరియు ఎన్నారై టి.ఆర్.ఎస్ మాజీ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, టాక్ అధ్యక్షులు పవిత్ర రెడ్డి కంది, ఉపాధ్యక్షులు సేరు సంజయ్, స్వాతి బుడగం, మరియు ముఖ్య సభ్యులు గోపాల్ మేకల, మట్టా రెడ్డి, వెంకట్ రెడ్డి దొంతుల, నవీన్ రెడ్డి, శ్రీకాంత్ జెల్ల, అశోక్ గౌడ్ దూసరి, రత్నాకర్ కడుదుల, మల్లా రెడ్డి, రంజిత్ చాతరాజు, సాయి బూరుగుపల్లి, సత్యం కంది, వంశీ వందనపు, వేణు గోపాల్ రెడ్డి, గణేష్ పాస్తం, రాకేష్ పటేల్, నవీన్ భువనగిరి, రవి రత్తినేని, రవి ప్రదీప్ పులుసు, సత్య చిలుముల, శ్రీధర్ రెడ్డి, రాజేష్ వర్మ, రవి కిరణ్, వెంకీ సుదిరెడ్డి, సతీష్ రెడ్డి గొట్టిముక్కుల, జస్వంత్, భరత్ బాశెట్టి, వేణు నక్కిరెడ్డి, వంశీ పొన్నం మహిళా విభాగం సభ్యులు, సుప్రజ పులుసు, ప్రవల్లిక భువనగిరి, క్రాంతి రత్తినేని, శ్రావ్య వందనపు, మమత జక్కీ, శ్వేతా మహేందర్, ప్రియాంక, తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *