mt_logo

విజయనగరంలో సిక్కు గురుద్వారాపై దాడి

సీమాంధ్రలో ఆందోళనలు వెర్రితలలు వేస్తున్నాయి. ఇవ్వాళ విజయనగరం టౌనులో ఉన్న ఒక గురుద్వారా మీద ఆందోళనకారులు దాడిచేసారు.

సమైక్య ఆందోళనకారులు గురుద్వారా అద్ద్దాలు మొత్తం పగులగొట్టిండ్రు. ఈ గురుద్వారాలో ఉన్న రెండు గురుగ్రంధ్ సాహిబ్ స్వరూపాలకు నష్టం వాటిల్లిందని స్థానిక సిఖ్ కాలనీలో ఉండే లక్బీర్ సింగ్ జాతీయ మీడియాకు తెలిపాడు. ఈ సంఘటన వివరాలను పంజాబ్ లోని తమ మత పెద్దలకు ఫోన్ ద్వారా వివరించినట్టు ఆయన మీడియాకు తెలిపారు.

ఇవ్వాళ కొంతమంది సమైక్యవాదులు స్థానిక సిఖ్ కాలనీకి వచ్చి ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పుడా పరిసర ప్రాంతాల్లో పరిస్థితి అదుపు చేయడానికి కర్ఫ్యూ విధించారు. సీఆర్పీఎఫ్ బలగాలు ఇప్పుడు ఆ ప్రాంతాన్ని మొత్తం అదుపులోకి తీసుకున్నారు. స్థానిక సిక్కు యువకులు తమకు రక్షణ కల్పించాలని పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

అసలు ఆంధ్ర – తెలంగాణ అంశానికీ, సిక్కులకు ఏం సంబంధం ఉన్నదని ఆందోళనకారులు ఈ దాడికి పాల్పడ్డారు?

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *