mt_logo

సిరిసిల్లలో రూ. 5 కే భోజనం పథకాన్ని ప్రారంభించిన కేటీఆర్..

సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ సిరిసిల్ల పట్టణంలో పర్యటిస్తున్నారు. ఉదయం 11గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరిన ఆయన సిరిసిల్లకు చేరుకొని జిల్లా కేంద్రంలో అక్షయపాత్ర రూ. 5 భోజన పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే కేటీఆర్ నెహ్రూ నగర్ లో వైకుంఠధామం, ఇందిరా పార్క్, ఏకలవ్య కమ్యూనిటీ హాల్, శాంతినగర్ ఓపెన్ జిమ్ ను ప్రారంభిస్తారు. 2.30 గం.లకు పట్టణ శివారులోని గుమ్షావలి దర్గాను సందర్శిస్తారు. 3 గంటలకు తడిచెత్త, పొడిచెత్త సేకరణ బ్యాటరీ వాహనాలు, 7 గంటలకు బతుకమ్మ ఘాట్ వద్ద మ్యూజికల్ ఫౌంటైన్ ను ప్రారంభిస్తారు. రాత్రి 7.30 గం.లకు బతుకమ్మ ఘాట్ వద్ద స్త్రీనిధి టాబ్స్ పంపిణీ చేయనున్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *