mt_logo

ఆస్ట్రేలియాలో ఘనంగా “జయశంకర్ సార్ స్ఫూర్తి సభ”

– ముఖ్య అతిధిగా తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి గారు

టీ.ఆర్.ఎస్ పార్టీ ఎన్నారై ఆస్ట్రేలియా శాఖ “ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టీ.ఆర్.ఎస్ (OFTRS)” ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంత కర్త స్వర్గీయ ప్రో. జయశంకర్ గారి ఐదవ వర్ధంతి సందర్భంగా, “తెలంగాణ స్ఫూర్తి సభ” మెల్బోర్న్ లో ఘనంగా నిర్వహించారు.

ముఖ్య అతిధిగా తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వాదులు, టీ.ఆర్.ఎస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టీ.ఆర్.ఎస్ (OFTRS) అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల అధ్యక్షతన ప్రారంభమైన ఈ కార్యక్రమం, ముందుగా జయశంకర్ గారి చిత్ర పటాన్ని పూలతో నివాలర్పించి, తెలంగాణ అమరవీరులను, జయశంకర్ గారిని స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ, తెలంగాణ బావజాల వ్యాప్తిలో జయశంకర్ గారి పాత్ర గొప్పదని, వారు చివరి వరకూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసమై పనిచేసారని, ప్రతి వ్యక్తి జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. టీ.ఆర్.ఎస్ పార్టీ జెండా మోసే అవకాశం కలిగించిన కే.సీ.ఆర్ గారికి, ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన కవిత గారికి, అలాగే నేడు ముఖ్య అతిధిగా వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న నిరంజన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.

అధికారిక శాఖ ఏర్పాటు జరిగిన తరువాత జరుగుతున్న మొదటి కార్యక్రమమైనప్పట్టికీ, భారీ సంఖ్యలో తెలంగాణ బిడ్డలు, పార్టీ కార్యకర్తలు హాజరై విజయవంతం చేయడం పట్ల ప్రజల్లో ముఖ్యంగా ప్రవాస బిడ్డల మనసుల్లో కే.సీ.ఆర్ గారి నాయకత్వం పట్ల ఉన్న అభిమానానికి ఇది నిదర్శం అని తెలిపారు.

ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ టీ.ఆర్.ఎస్ ఆస్ట్రేలియా శాఖ భవిష్యత్తు కార్యక్రమాలు, విధి – విధానాల గురించి సభకు వివరించారు. గతంలో తెలిపినట్టు మరొక్కసారి ఆసక్తి గల టీ.ఆర్.ఎస్ పార్టీ అభిమానులకు, మద్దతుదారులు ముందుకు వచ్చి అధికారిక శాఖలో పాల్గొని మనమందరం కలిసి పార్టీకి మన వంతు బాధ్యత నిర్వహిద్దామని పిలుపునిచ్చారు.

ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ, టీ.ఆర్.ఎస్ పార్టీకి – జయశంకర్ గారికి ఉన్న అనుబంధం గురించి అలాగే వ్యక్తిగతంగా వారికి ఉన్న సాన్నిహిత్యం గురించి సభకు వివరించారు. తెలంగాణ సమాజానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు జయశంకర్ గారు చేసిన కృషి చాలా గొప్పదని తెలిపారు.

ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు తీసుకెళ్తున్న తీరుని, వివిద రంగాల్లో నేటి వరకు జరిగిన – భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధి గురించి సభకు వివరించారు. ఎన్నారైలుగా పార్టీకి చేస్తున్న సేవను అభినందించి, అన్ని సమయాల్లో అందుబాటులో ఉండి కావలసిన సహాయం అందిస్తానని తెలిపారు.

అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల తో పాటు సంస్థ ముఖ్య నాయకులు అనిల్ బైరెడ్డి, డా. అనిల్ రావు చీటీ నిరంజన్ రెడ్డి గారిని శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించి, ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ అధ్యక్షుడు నాగేందర్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నాగేందర్ కాసర్లతో పాటు ముఖ్య నాయకులు అనిల్ బైరెడ్డి, అనిల్ రావు చీటీ, అర్జున్ చల్ల గుల్ల, అమర్ రావు చీటీ, సత్యం రావు, ప్రకాష్ సూరపనేని, రోహిత్, సునిల్, ఉదయ్ కల్వకుంట్ల, సాయి ఉప్పు, శ్రీనివాస్ చింతల, అభిమన్యు సభ్యులు అవినాష్, రాఘవేందర్, వెంకట్, హేమంత్, కిరణ్, అటై (ATAI) ప్రథినిదులు ప్రవీణ్ దేశం, రాజ్ ఉల్పల, శ్రీనివాస్ కర్ర మరియు ఇతర తెలంగాణ వాదులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *