mt_logo

నిజామాబాద్ మార్కెట్ యార్డును అభివృద్ధి చేస్తాం..

శాసనసభ సమావేశాల్లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, తెలంగాణలో వరంగల్ మార్కెట్ యార్డు తర్వాత అతి పెద్ద మార్కెట్ యార్డు నిజామాబాద్ మార్కెట్ యార్డు అని, ఇందులో మహిళా రైతులకు విశ్రాంతి గది నిర్మించామని, కూరగాయల మార్కెట్ ను మార్కెట్ యార్డుకు మారుస్తామని చెప్పారు. రైతు బంధు పథకం కింద రుణాన్ని రూ. లక్ష నుండి రూ. 2 లక్షలకు పెంచామని, రూ. కోటి 15 లక్షలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, మరో రూ. రెండు కోట్లతో వర్క్ షెడ్ ను కూడా మంజూరు చేస్తామని అన్నారు. వడ్డీ చెల్లించకుండానే ధాన్యం నిల్వ చేసుకునే వెసులుబాటు కల్పించామని, మార్కెట్ యార్డుల్లో త్వరలోనే ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ విధానం ప్రవేశపెడతామని హరీష్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *